అన్వేషించండి

ODI WC 2023 Tickets: ఆరు గంటలు వెయిట్ చేస్తే నిమిషాల్లోనే ఖతం - హాట్ కేకుల్లా భారత్, పాక్ మ్యాచ్ టికెట్లు

భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అయిపోయాయి.

ODI WC 2023 Tickets: దాయాది దేశాల క్రికెట్ సమరం అంటే ఉండే క్రేజే వేరు. అదీ  వరల్డ్ కప్ వంటి హై ఓల్టేజ్ టోర్నమెంట్‌లో అయితే  అది  నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. క్రికెట్ అంటే పడిచచ్చే  భారత్, పాకిస్తాన్‌లలో  అభిమానులు ఈ  ఇరు జట్ల మధ్య   ఐసీసీ టోర్నీలలో మ్యాచ్ కోసం   ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో  భారత్ - పాకిస్తాన్ మధ్య  జరగాల్సి ఉన్న  మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.  ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి పెట్టిన నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. 

మంగళవారం తొలి విడతగా భారత్ - పాక్ మ్యాచ్ టికెట్లను  ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ప్రముఖ యాప్  బుక్ మై షో (Book My Show) లో వీటి  అమ్మక ప్రక్రియ జరిగింది. అయితే  భారత అభిమానులు టికెట్ల కోసం ఆరు గంటల ముందు నుంచే వేయిట్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభమవుతుందని  తెలపగా  క్రికెట్ ఫ్యాన్స్ యాప్ ఓపెన్ చేయడంతో  అది కొంతసేపు క్రాష్ అయింది.  సాయంత్రం  ఆరు గంటలకు ఓపెన్ అయిన టికెట్ల అమ్మకాలు కొన్ని నిమిషాల్లోనే  అయిపోయాయి.  బుక్ మై షో లో టికెట్ల అమ్మకం  ప్రారంభమైన గంట లోపే ‘సోల్డ్ ఔట్’ అని కనిపించింది. 

ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష.. 

హై డిమాండ్‌తో యాప్ కొంతసేపు క్రష్ అయి తిరిగి సెట్ అయినా..   టికెట్ల కోసం వచ్చిన  నెటిజన్ల ఓపికను అది పరీక్షించింది. ‘మీరు క్యూలో యాడ్ అయ్యారు.  మీకు టికెట్ కన్ఫమ్ కావాలంటే  కనీసం గంట కంటే ఎక్కువసేపు వెయిట్ చేయండి..’ అన్న సందేశం అభిమానులకు విసుగు తెప్పించింది. ఆ గంట సమయం కాస్తా మూడు,  నాలుగు, ఐదు, ఆరు గంటలకు చేరింది. కొంతమందికి  మాత్రం  ‘మీ టైమ్ రాగానే  స్క్రీన్ పై  సీట్ల వరుస కనబడుతుంది.  డిమాండ్ ఎక్కువగా ఉన్నందున  మీరు త్వరగా బుక్ చేసుకోండి.. వేచి ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అని చావు కబురు చల్లగా చెప్పారు.  క్రికెట్ ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను  ట్వీట్స్ చేస్తూ  బుక్ మై షో సర్వీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.  టికెట్లు బుక్ చేసుకోవడానికి  బీసీసీఐ, ఐసీసీ ఇకనైనా మంచి  టికెట్ బుకింగ్ యాప్‌లను ఎంపిక చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు. 

 

 

మరోసారి టికెట్ల అమ్మకం.. 

నిన్న టికెట్లు బుక్ చేసుకోనివారు, టికెట్లు దొరకని ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సెప్టెంబర్ 3న  మరో విడత  విక్రయం ఉంటుందని  బీసీసీఐ వర్గాలు తెలిపాయి.   అహ్మదాబాద్‌లో జరుగబోయే ఇండియా మ్యాచ్‌తో పాటు ఇతర మ్యాచ్‌లకు టికెట్ల తేదీని కూడా ఐసీసీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget