అన్వేషించండి

DC vs MI, Match Highlights: ఉత్కంఠ పోరులో బోణీ కొట్టిన ముంబై - ఢిల్లీకి తప్పని నాలుగో ఓటమి

IPL 2023, DC vs MI: ఐపీఎల్ - 2023 సీజన్‌లో రెండు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ దురదృష్టాన్ని మరికాస్త పొడిగిస్తూ సూపర్ విక్టరీ అందుకుంది.

IPL 2023, DC vs MI: ఐపీఎల్ -16 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన  మ్యాచ్ లో  ఘన విజయాన్ని అందుకుంది. ముంబై సారథి  రోహిత్ శర్మ (65: 45 బంతుల్లో, 6 బౌండరీలు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (41: 29 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) , ఇషాన్ కిషన్   (31: 26 బంతుల్లో 6 ఫోర్లు) ల నిలకడైన ఆటతో పాటు చివర్లో కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ల పోరాటంతో ఎంఐకి తొలి విజయం దక్కింది. ఐపీఎల్‌లో మునపటి  రోహిత్ శర్మను గుర్తు చేస్తూ హిట్‌మ్యాన్  అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో ముంబై.. ఢిల్లీ నిర్దేశించిన  173 పరుగుల లక్ష్యాన్ని  20 ఓవర్లలో 4 వికెట్లు  కోల్పోయి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా నాలుగో పరాజయం. ఇక నుంచి  ఆ జట్టుకు ప్లేఆఫ్స్ కష్టాలు మొదలైనట్టే..!

173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. రోహిత్‌తో పాటు  ఇషాన్ కిషన్  ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో  71 పరుగులు జోడించారు. ముకేష్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే  రోహిత్  4, 6, 4 తో తన ఆట ఎలా ఉండబోతుందో స్పష్టంగా చెప్పాడు. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. నోర్జే వేసిన మరుసటి ఓవర్లో ఇషాన్ ఓ బౌండరీ బాదగా చివరి  రెండు బంతులను హిట్‌మ్యాన్  6,4 గా మలిచాడు.  అక్షర్ వేసిన ఐదో ఓవర్లో  రెండో బంతికి  సింగిల్ తీయడం ద్వారా ముంబై 50 పరుగులు దాటింది.  

సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్న ఈ జోడీకి సమన్వయం లోపం వల్ల షాక్ తగిలింది.  లలిత్ యాదవ్ వేసిన  8వ ఓవర్  మూడో బంతికి  ఇషాన్  పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్  ఎండ్ లో ఉన్న రోహిత్  సగం క్రీజు దాటినా  ఇషాన్ మాత్రం కదల్లేదు.  కానీ వెంటనే  రోహిత్ కోసం వికెట్ త్యాగం చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. 

హిట్‌మ్యాన్ తోడుగా తిలక్ బాదగా.. 

ఇషాన్ స్థానంలో వచ్చిన తిలక్ వర్మతో కలిసి హిట్ మ్యాన్ ముంబై ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు.   కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో  లెగ్ సైడ్ దిశగా సింగిల్ తీసిన రోహిత్ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఐపీఎల్ లో రోహిత్  24 ఇన్నింగ్స్ (2021లో చివరి ఫిఫ్టీ) తర్వాత  అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇదే ఓవర్లో  తిలక్ వర్మ ఓ సిక్సర్, రోహిత్ ఓ ఫోర్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో తప్పుకుండా గెలవాలన్న పట్టుదలతో ఆడిన  రోహిత్ - తిలక్ లు వికెట్లు కాపాడుకుంటూనే  వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు.  

15 ఓవర్లు ముగిసేసరికి  ముంబై స్కోరు  123-1 గా ఉంది.  చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉండగా  ముకేశ్ కుమార్  వేసిన 16వ ఓవర్లో తిలక్.. 4, 6,  6 తో లక్ష్యాన్ని కరిగించాడు. 

ఏడు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు : 

తిలక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డా.. ముకేశ్ వేసిన అదే ఓవర్లో  ఐదో బంతికి  లో ఫుల్ టాస్ ను భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ వద్ద మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే  ఫామ్ లేక తంటాలు పడుతున్న సూర్యకుమార్ యాదవ్  (0)  కూడా మరో  గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు.   ముస్తాఫిజుర్ వేసిన  17వ ఓవర్లో  రోహిత్.. వికెట్ కీపర్ అభిషేక్ సూపర్ క్యాచ్ తో  వెనుదిరిగాడు. 

ఆఖర్లో హై డ్రామా.. 

వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన  ముంబైకి ఆస్ట్రేలియా కుర్రాళ్లు టిమ్ డేవిడ్ (13 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్) లు ఆఖర్లో  వచ్చినా భారీ మెరుపులు సాగలేదు.  చివరి ఓవర్లో ఆరు పరుగుల కావాల్సి ఉండగా.. తొలి బంతికి ఒక్క పరుగే వచ్చింది. రెండు, మూడు బాల్స్ కు  రన్ రాలేదు. నాలుగో బాల్ కు ఒక్క పరుగే వచ్చింది. ఐదో బంతికి ఒక్క  పరుగే వచ్చినా  చివరి బాల్ కు  రెండు రన్స్ అవసరం కాగా.. టిమ్ డేవిడ్ - గ్రీన్ లు వికెట్ల మధ్య  వేగంగా పరుగు తీసి ముంబైకి తొలి విజయాన్ని అందించారు.  

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్   172 పరుగులకే ఆలౌట్ అయింది.   కెప్టెన్ డేవిడ్ వార్నర్  (51),  అక్షర్ పటేల్ (54)లు అర్థ సెంచరీలతో ఆదుకోగా మనీష్ పాండే (26) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో  బెహ్రాండార్ఫ్, చావ్లాలు తలా మూడు వికెట్లు తీయగా  మెరిడిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget