అన్వేషించండి

Mayank Agarwal: ఇదేం ఫిట్‌నెస్‌రా బాబు - కోహ్లీ, గిల్‌లను మించిపోయాడుగా!

టెస్టులలో టీమిండియాకు ఓపెనర్‌గా ఆడిన మయాంక్ అగర్వాల్ గుర్తున్నాడా..? ఫామ్ కోల్పోయి దేశవాళీలో మెరుగవుతున్న మయాంక్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Mayank Agarwal: భారత క్రికెట్‌ జట్టులో సూపర్ ఫిట్‌గా ఉన్న క్రికెటర్లు ఎవరో చెప్పండి..? అంటే  మొన్నటిదాకా చెప్పిన పేర్లు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా.  ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే వీళ్లకు ఈ  ఏడాది  యువ సంచలనం  శుభ్‌మన్ గిల్ సవాలు విసిరాడు. భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే కొలమానంగా మారిన యో యో టెస్టులో   గిల్.. రికార్డు స్కోరు చేశాడు.  కొద్దిరోజుల క్రితమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో  యో యో టెస్టులో గిల్.. ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోరు  (18.7 పాయింట్లు) చేశాడు. కానీ ఈ రికార్డును టీమిండియా టెస్ట్ టీమ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్రేక్ చేశాడు. 

క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా మారిన యో యో టెస్టులో మయాంక్ ఏకంగా  21.1  పాయింట్లు స్కోరు చేశాడు. ఇది గిల్ (18.7), విరాట్ కోహ్లీ  (17.2)  కంటే  ఎక్కువ కావడం గమనార్హం.  ప్రస్తుతం  అక్టోబర్ నుంచి మొదలుకాబోయే దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్న మయాంక్.. యో యో స్కోరును ఘనంగా మెరుగుపరుచుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను అతడే  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. అందుకు సిద్ధమవుతున్నట్టుగా అందులో పేర్కొన్నాడు.  ఇదే పోస్ట్‌లో లెవల్ 21.1  స్కోరు చేసినట్టు రాసుకొచ్చాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mayank Agarwal (@mayankagarawal)

కాగా గతనెలలో ఆసియా కప్‌కు ముందు  బెంగళూరుకు సమీపంలోని ఆలూరులో  నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు యో యో టెస్టును నిర్వహించగా గిల్  18.1 స్కోరుతో అందరికంటే ముందు నిలిచాడు. తాను కూడా యో యో టెస్టులో 17 పాయింట్లు సాధించానని కోహ్లీ తన సామాజిక మాధ్యమాలలో  చేసిన  పోస్టుపై బీసీసీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆటగాళ్లు యో యో టెస్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను  పబ్లిక్ డొమైన్‌లో ఉంచరాదని   కోహ్లీతో పాటు ఇతర  ఆటగాళ్లనూ హెచ్చరించింది.  బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లెవరూ అలా చేయకూడదని కూడా అల్టిమేటం  జారీ చేసింది.   అయితే మయాంక్ మాత్రం   ప్రస్తుతం భారత జట్టులో  ఏ ఫార్మాట్‌లోనూ ఆడటం లేదు. 

 

టెస్టు స్పెషలిస్టుగా వచ్చిన మయాంక్.. ఇంగ్లాండ్‌తో గతేడాది   బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఆడాడు.  అది కూడా రోహిత్ శర్మ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆ టెస్టులో అతికి ఆడే అవకాశమొచ్చింది. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో అతడు జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.  

మయాంక్ ఇంతరవకూ భారత జట్టు తరఫున 19 టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు.  టెస్టులలో 1,429 పరుగులు చేసిన అతడి ఖాతాలో నాలుగు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఇక  ఐదు వన్డేలలో అతడు చేసింది 86  పరుగులు మాత్రమే. ఐపీఎల్‌లో 2022 వరకూ పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మయాంక్‌ను  ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 8.5 కోట్లు వెచ్చించి  దక్కించుకున్నా అతడు  ఐపీఎల్-16లో కూడా దారుణంగా విఫలమయ్యాడు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Virat Kohli Creates History: కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
Rajat Patidar Scripts History: పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్‌సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి
పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్‌సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Embed widget