అన్వేషించండి

Mayank Agarwal: ఇదేం ఫిట్‌నెస్‌రా బాబు - కోహ్లీ, గిల్‌లను మించిపోయాడుగా!

టెస్టులలో టీమిండియాకు ఓపెనర్‌గా ఆడిన మయాంక్ అగర్వాల్ గుర్తున్నాడా..? ఫామ్ కోల్పోయి దేశవాళీలో మెరుగవుతున్న మయాంక్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Mayank Agarwal: భారత క్రికెట్‌ జట్టులో సూపర్ ఫిట్‌గా ఉన్న క్రికెటర్లు ఎవరో చెప్పండి..? అంటే  మొన్నటిదాకా చెప్పిన పేర్లు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా.  ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే వీళ్లకు ఈ  ఏడాది  యువ సంచలనం  శుభ్‌మన్ గిల్ సవాలు విసిరాడు. భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే కొలమానంగా మారిన యో యో టెస్టులో   గిల్.. రికార్డు స్కోరు చేశాడు.  కొద్దిరోజుల క్రితమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో  యో యో టెస్టులో గిల్.. ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోరు  (18.7 పాయింట్లు) చేశాడు. కానీ ఈ రికార్డును టీమిండియా టెస్ట్ టీమ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్రేక్ చేశాడు. 

క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా మారిన యో యో టెస్టులో మయాంక్ ఏకంగా  21.1  పాయింట్లు స్కోరు చేశాడు. ఇది గిల్ (18.7), విరాట్ కోహ్లీ  (17.2)  కంటే  ఎక్కువ కావడం గమనార్హం.  ప్రస్తుతం  అక్టోబర్ నుంచి మొదలుకాబోయే దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్న మయాంక్.. యో యో స్కోరును ఘనంగా మెరుగుపరుచుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను అతడే  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. అందుకు సిద్ధమవుతున్నట్టుగా అందులో పేర్కొన్నాడు.  ఇదే పోస్ట్‌లో లెవల్ 21.1  స్కోరు చేసినట్టు రాసుకొచ్చాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mayank Agarwal (@mayankagarawal)

కాగా గతనెలలో ఆసియా కప్‌కు ముందు  బెంగళూరుకు సమీపంలోని ఆలూరులో  నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు యో యో టెస్టును నిర్వహించగా గిల్  18.1 స్కోరుతో అందరికంటే ముందు నిలిచాడు. తాను కూడా యో యో టెస్టులో 17 పాయింట్లు సాధించానని కోహ్లీ తన సామాజిక మాధ్యమాలలో  చేసిన  పోస్టుపై బీసీసీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆటగాళ్లు యో యో టెస్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను  పబ్లిక్ డొమైన్‌లో ఉంచరాదని   కోహ్లీతో పాటు ఇతర  ఆటగాళ్లనూ హెచ్చరించింది.  బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లెవరూ అలా చేయకూడదని కూడా అల్టిమేటం  జారీ చేసింది.   అయితే మయాంక్ మాత్రం   ప్రస్తుతం భారత జట్టులో  ఏ ఫార్మాట్‌లోనూ ఆడటం లేదు. 

 

టెస్టు స్పెషలిస్టుగా వచ్చిన మయాంక్.. ఇంగ్లాండ్‌తో గతేడాది   బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఆడాడు.  అది కూడా రోహిత్ శర్మ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆ టెస్టులో అతికి ఆడే అవకాశమొచ్చింది. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో అతడు జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.  

మయాంక్ ఇంతరవకూ భారత జట్టు తరఫున 19 టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు.  టెస్టులలో 1,429 పరుగులు చేసిన అతడి ఖాతాలో నాలుగు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఇక  ఐదు వన్డేలలో అతడు చేసింది 86  పరుగులు మాత్రమే. ఐపీఎల్‌లో 2022 వరకూ పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మయాంక్‌ను  ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 8.5 కోట్లు వెచ్చించి  దక్కించుకున్నా అతడు  ఐపీఎల్-16లో కూడా దారుణంగా విఫలమయ్యాడు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget