అన్వేషించండి

India vs England: నేటి నుంచే హైదరాబాద్‌ టెస్ట్‌ టికెట్ల విక్రయం

India vs England:  హైదరాబాద్‌ ఉప్పల్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్‌ - ఇంగ్లాండ్‌ తొలి టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి.

 హైదరాబాద్‌(Hyderabad) ఉప్పల్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్‌ - ఇంగ్లాండ్‌(India versus England) తొలి టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం ఏడు గంటల నుంచి పేటీఏం ఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌తో పాటు ఇన్‌ సైడర్‌ వెబ్‌ సైట్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌( Hyderabad Cricket Association )తెలిపింది. మిగిలిన టిక్కెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మనున్నట్లు ప్రకటించింది. పాఠశాల విద్యార్థుల‌కు ఉచితంగా మ్యాచ్‌ని తిలకించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అవకాశం కల్పించింది. రిప‌బ్లిక్ డే రోజున భార‌త సాయుధ ద‌ళాల సిబ్బందికి  సైతం అవకాశమిచ్చింది. టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధ‌రలు 200 నుంచి 4 వేల రూపాయల వరకు నిర్ణయించారు.
 
కనిష్టం రెండు రూ.200...
భారత్‌, ఇంగ్లాండ్‌( IND Vs ENG) మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కు నేటి నుంచి టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ టికెట్లను పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌లో విక్రయించనున్నారు. మిగిలిన టికెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు జింఖానాలో అమ్ముతారు. కనీస టికెట్‌ ధర రూ. 200 కాగా.. గరిష్ఠంగా రూ. 4 వేలు ఉంది. మ్యాచ్‌ సందర్భంగా 25 వేల కాంప్లిమెంటరీ పాసులను పాఠశాల విద్యార్థులకు కేటాయించారు. విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను గణతంత్ర దినోత్సవం నాడు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని చెప్పాడు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్‌ చేయాలని‌ వివరించారు. ఈ మ్యాచ్‌కు ముందు హైద‌రాబాద్ క్రికెట్ సంఘం(HCA) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సైనిక కుటుంబాల‌కు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నుంది. మ‌రుసటి రోజు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం(Republic Day) ఉన్నందున సైనికుల గౌర‌వార్థం వాళ్ల కుటుంబాల‌ను ఫ్రీగా అనుమ‌తించ‌నుంది.
 
కొనసాగుతున్న విశాఖ టెస్ట్‌ టికెట్ల విక్రయం
విశాఖ(Visakha)లో ఇండియా - ఇంగ్లాండ్(Ind vs Eng Test) మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 26 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా...ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget