అన్వేషించండి

Pune T20 Live Updates: భారత్ భారీ స్కోరు.. పాండ్యా, దూబే ఫిఫ్టీలు.. రాణించిన సాకిబ్, మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతం

మిడిలార్డర్ బ్యాటర్లు దూబే, హార్దిక్ రాణించడంతో పుణే టీ20లో ఇండియా భారీ స్కోరు సాధించింది. ఇక బౌలర్లు రాణిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. 5 టీ20ల సిరీస్ లో 2-1తో ఇండియా ఆధిక్యంలో ఉంది. 

India Vs England 4th T20 Live Updates: పుణే టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది.  సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సాధించేందుకు భారత్ ముందడగు వేసింది. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ ఫిఫ్టీ (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో రెచ్చిపోవడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు సాధించింది. అటు బ్యాటింగ్ కు ఇటు బౌలింగ్ కు అనుకూలమైన పిచ్‌పై బ్యాటర్లు తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది.

ఆల్ రౌండర్ శివమ్ దూబే  (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో కీలకదశలో రాణించాడు. ఒకదశలో 79/5తో నిలిచిన జట్టును హార్దిక్, శివమ్ దూబే జంట ఆదుకుంది. ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించింది. దీంతో ఇండియా అనుకున్నదానింకటే  భారీ స్కోరు సాధించింది.  ఇప్పటికే సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించినట్లవుతుంది. బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఓవర్టన్ కు రెండు వికెట్లు దక్కాయి.  ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, రింకూ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. 

ట్రిపుల్ వికెట్ మెయిడిన్..
పుణే మ్యాచ్ ఆరంభంలో అభిమానులకు షాక్ తగిలింది. ఆరంబంలోనే ముగ్గురు కీలక ప్లేయర్లు ఔట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యింది. పేసర్ తను వేసిన ఒకే ఓవర్లో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లను డకౌట్లుగా పెవిలియన్ కు పంపాడు. తొలుత తన బలహీనతన మరోసారి బయట పెట్టుకుంటూ ఫుల్ షాట్ కు సంజూ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతినే డీప్ థర్డ్ మ్యాన్ కు క్యాచ్ ఇచ్చి తిలక్ ఔటయ్యాడు. రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో సాకిబ్ హ్యాట్రిక్ ముందు నిలిచాడు. సూర్య ఆ అవకాశాన్ని విఫలం చేసి, మరో మూడు బంతుల తర్వాత ఔటయ్యాడు. దీంతో వికెట్ మెయిడిన్ గా సాకిబ్ వేసినట్లయ్యింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి రింకూ సింగ్ (30) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ వైపు రింకూ కాస్త స్లోగా ఆడితే, ఉన్నంత సేపు అభిషేక్ బ్యాట్ ఝుళిపించాడు. అలా నాలుగో వికెట్ కు 32 బంతుల్లో 45 పరుగులు జోడించారు. ఈ దశలో ఆదిల్ రషీద్.. అభిషేక్ ను బోల్తా కొట్టించడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఎనిమిదో ఓవర్ రెండో బంతిని ఊరించే విధంగా వేయగా, స్లాగ్ స్వీప్ కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఇక నిలకడగా ఆడుతున్న రింకూను బ్రైడెన్ కార్స్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 79 పరుగులకే సగం వికెట్లను భారత్ కోల్పోయింది. 

సూపర్ భాగస్వామ్యం..
ఓ దశలో 150 పరుగులైనా భారత్ దాటుతుందా అన్న దశలో, భారీ స్కోరును సాధించడం వెనకాల దూబే, పాండ్య శ్రమ దాగుంది. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. స్ట్రైక్ రొటేట్ చక్కగా చేయడంతో ఇంగ్లాండ్ పై ఒత్తిడి పడింది. అలా హుషారుగా వీరిద్దరూ ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఈక్రమంలో 27 బంతుల్లోనే పాండ్యా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్కోరు పెంచే క్రమంలో ఓవర్టన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (5) మరోసారి విఫలం కాగా, ఓ దశలో నిలబడిన దూబే.. స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి, ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. బౌలర్లలో కార్స్, రషీద్ ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో దూబే, రింకూ సింగ్ ను తీసుకొని రావడం వల్ల ఇండియా, సాకిబ్ మహ్మూద్ ను ఆడించడం వల్ల ఇంగ్లాండ్ లాభపడ్డాయి. 

Read Also: U19 Women World Cup: ఫైనల్లో భారత్.. 9 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు.. 2న ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా ఢీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Embed widget