అన్వేషించండి

IND vs SL: శ్రీలంకతో సిరీస్ కు జట్టులో దక్కని స్థానం- వైరల్ గా మారిన పృథ్వీ షా పోస్ట్

IND vs SL: శ్రీలంకతో సిరీస్ లకు జట్టులో చోటు దక్కని భారత యువ బ్యాటర్ పృథ్వీ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.

IND vs SL:  శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇందులో భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు ఏ సిరీస్ లోనూ స్థానం లభించలేదు. దీనిపై ఆవేదన చెందిన షా తన సోషల్ మీడియా అకౌంట్ లో రెండు పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. 

భారత్ క్రికెట్ లో అసమానమైన ప్రతిభ ఉంది. తుది జట్టులోనే కాక రిజర్వ్ బెంచ్ లోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ఒక్కో స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ప్రతి ఆటగాడికి సవాల్ గా మారింది. ప్రస్తుతం పృథ్వీషా పరిస్థితి కూడా అలానే ఉంది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు ఏ ఒక్కదానిలోనూ సెలక్టర్లు పృథ్వీని సెలక్ట్ చేయలేదు. ఓపెనర్ గా వచ్చే షా చివరిసారిగా జూలై 2021 లో భారత్ తరఫున ఆడాడు. అప్పటినుంచి మళ్లీ టీమిండియాకు ఆడలేదు. దేశవాళీల్లో రాణిస్తున్నప్పటికీ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇప్పుడు లంకతో జరిగే సిరీస్ లకు అతడిని ఎంపికచేయలేదు. 

ఈ క్రమంలోనే శ్రీలకంతో సిరీస్ లకు జట్ల ప్రకటన తర్వాత పృథ్వీ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టాడు. ఒకటి కవిత్వం కాగా.. రెండో గౌర్ గోపాల్ దాస్ చెప్పిన మాటల వీడియో. 

ఎవరైనా నవ్వుతూ ఉంటే వారు తమ జీవితంలో సంతోషంగా ఉన్నారని కాదు. ఆనందం ఎప్పుడూ దానంతటదే రాదు కానీ సమస్యలు మాత్రం వాటంతటవే వస్తాయి. 

ఎవరైనా సానుకూలత, ప్రేమ, సంతోషాన్ని ఎంచుకుంటారు. కోపం, ద్వేషం, ప్రతికూలత అనేవి మనుషులలో స్వయంచాలకంగా ఉంటాయి. ప్రేమ, సానుకూలత ఎంచుకుంటేనే మనం మనుషులుగా ఉంటాం. 

అని గౌర్ గోపాల్ దాస్ చెప్పిన మాటల వీడియోను పంచుకున్నాడు. 

దేశవాళీ టోర్నీల్లో పృథ్వీ షా ఇటీవల ప్రదర్శన

  • ప్రస్తుతం పృథ్వీ షా రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. 4 ఇన్నింగ్సుల్లో 10.50 సగటుతో 42 పరుగులు చేశాడు. 
  • విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్సుల్లో 217 పరుగులతో రాణించాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. 
  • సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 మ్యాచులు ఆడిన పృథ్వీ షా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సహా 332 పరుగులు సాధించాడు. 

 

బీసీసీఐ షాను ఎందుకు విస్మరిస్తోంది

పృథ్వీ షా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లు రాణిస్తున్నారు. వారు ఫాంలో ఉన్నారు. అలాగే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో షాకు స్థానం దక్కడం కష్టమే. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Embed widget