అన్వేషించండి

IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి

India vs New Zealand Test Series | ముంబై టెస్టులో 25 రన్స్ తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దాంతో 3-0 తేడాతో టీమిండియాను పర్యాటక జట్టు న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది.

IND vs NZ 3rd Test Highlights New Zealand registering 3-0 win against India | ముంబై: మూడో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యం అయినా భారత బ్యాటర్లు విఫలం కావడంతో స్వదేశంలో మరో ఓటమి తప్పలేదు. దీంతో టెస్టు సిరీస్ లో భారత్ ను న్యూజిలాండ్ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఓడించి 3-0తో వైట్ వాష్ చేసింది. టెస్టు చరిత్రలో భారత్ గడ్డమీద వరుసగా మూడు టెస్టుల్లో ఓడటం ఇదే తొలిసారి. కాగా టెస్టు చరిత్రలో భారత్ లో సిరీస్ లో ఆడిన 3 లేదా అంతకంటే ఎక్కువ ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ ఓడటం ఇదే తొలిసారి. ఇదివరకే 12 ఏళ్ల తరువాత భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. చివరి టెస్టులోనైనా నెగ్గి రోహిత్ శర్మ సేన వైట్ వాష్ ను తప్పించుకుంటుందని భావించినా, నిరాశే ఎదురైంది. రిషభ్ పంత్ (64) హాఫ్ సెంచరీతో పోరాటం చేయకపోతే ఈ ఓటమి సైతం దారుణంగా ఉండేది. కివీస్ 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకు ఆలౌట్ కావడంతో, 25 రన్స్ తేడాతో మూడో టెస్టులో ఓటమి పాలైంది. 

టెస్టుల్లో 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా తొలిసారి వైట్ వాష్ అయింది. చివరగా 2000లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్ ఓటమి ఎదుర్కొంది. గతంలో సచిన్ కెప్టెన్సీలో పటిష్ట దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడిన భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. కానీ అజారుద్దీన్, హ్యాన్సీ క్రానే ఫిక్సింగ్ ఉందంతంతో అది ఓ అసంబద్ధ టెస్ట్ సిరీస్ గా పరిగణిస్తారు. తాజాగా స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పన్నెండేళ్ల తరువాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. మూడో టెస్టులో ఓటమితో కివీస్ చేతిలో 3-0 తో వైట్ వాష్ అయింది. 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యం
ముంబై టెస్టులో నెగ్గి మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుందామని చూసిన జట్టు పోరాటం చేయకుండానే కివీస్ కు సిరీస్ అప్పగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు రాణించడంతో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్ 4 వికెట్లు తీయగా, అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) హాష్ సెంచరీలు చేయడం, చివర్లో వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్) మెరుపులో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 

స్పిన్ కు అలనుకూలిస్తున్న వాంఖడేలో రెండో ఇన్నింగ్స్ లోనూ భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన యంగ్ (51) రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. కాన్వే (22), మిచెల్ (21), ఫిలిప్స్ (26) పరుగులు చేయడంతో 174 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా మరో 5 వికెట్ల ఇన్నింగ్స్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ 3 వికెట్లు, సుందర్, ఆకాష్ దీప్ చెరో వికెట్ తీశారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), గిల్ (1), సర్ఫరాజ్ (1)కి ఔటయ్యారు. రిషబ్ పంత్ (64) ఫియర్ లెస్ హాఫ్ సెంచరీతో భారత్ నెగ్గేలా కనిపించింది. కానీ డిఫెన్స్ ఆడిన బంతిని కీపర్ బ్లండెల్ క్యాచ్ పట్టడంతో పంత్ నిరాశగా వెనుదిరిగాడు. వెంట వెంటనే అశ్విన్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. ఈ ముగ్గురు జట్టు స్కోరు 121 వద్దే ఔట్ కావడంతో 25 రన్స్ తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. 3-0 తేడాతో భారత్ ను వైట్ వాష్ చేసింది.

స్కోర్ కార్డ్ వివరాలు..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 235 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 262 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ -  174 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 121 ఆలౌట్

2000లో సచిన్ కెప్టెన్సీలో భారత్ వైట్ వాష్ ఓటమి

2000లో భారత్ స్వదేశంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.  ఫిబ్రవరిలో జరిగిన ఆ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సచిన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సఫారీ బౌలర్లు జాక్ కలిస్ 3-30, అలన్ డోనాల్డ్ 2-23, షాన్ పోలాక్ 243, హ్యాన్సీ క్రానే 2-26 రాణించడంతో భారత్ 225 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సచిన్ 163 బంతుల్లో 97 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా 176కే ఆలౌటైంది. కానీ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 113 పరుగులకు కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా 163 టార్గెట్ ను ఛేజ్ చేసింది.  

మార్చిలో జరిగిన బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 158 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్ లో 250కి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 479 పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ 71 రన్స్ తేడాతో భారత్ దారుణంగా ఓటమి చెందింది. దాంతో 2-0తో భారత గడ్డమీద సఫారీలో టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసినట్లు అయింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget