By: ABP Desam | Updated at : 04 Jul 2022 01:48 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
మూడో రోజు మ్యాచ్లో భారీ షాట్ ఆడుతున్న పంత్ (Image Credits: BCCI)
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ భారత్ చేతిలోకి దాదాపు వచ్చేసినట్లే. మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 132 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దాన్ని కూడా కలుపుకుంటే ఇప్పటికే టీమిండియా ఇప్పటికే 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ ఉన్నారు.
132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ మూడో బంతికే అవుటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ పుజారా, హనుమ విహారి ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. వీరిద్దరూ రెండో వికెట్కు 39 పరుగులు జోడించారు.
అనంతరం బ్రాడ్... హనుమ విహారిని అవుట్ చేసి రెండో వికెట్ను ఇంగ్లండ్కు అందించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పేలవ ఫాం ఈ మ్యాచ్లో కూడా కొనసాగింది. బెన్ స్టోక్స్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు.
ఆ తర్వాత రిషబ్ పంత్, పుజారా మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు ఇప్పటికే 50 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇప్పటికే 257 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు కాబట్టి నాలుగో రోజు వీలైనంత వేగంగా ఆడి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తే భారత బౌలర్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. అదే సమయంలో ఇటీవల ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ మైండ్ సెట్ కూడా మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్పై భారీ లక్ష్యాలను కూడా అలవోకగా ఇంగ్లండ్ ఛేదించింది. కాబట్టి వారిని కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఏదేమైనా నాలుగో రోజు ఆటకు కీలకంగా మారనుంది.
Ross Taylor Slapgate: షాకింగ్ రిపోర్ట్స్! రాస్ టేలర్ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా!?
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?
Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
IND vs ZIM: ఓ మై గాడ్! టీమ్ఇండియాకే వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కోచ్!
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్