News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

WTC 2023 Prize Money: విజేతకు రూ.కోట్ల వర్షం - ఐసీసీ టెస్టు ఛాంపియన్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ.13.2 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

FOLLOW US: 
Share:

WTC 2023 Final Prize Money IND vs AUS: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్‌పై 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు రూ. కోట్లలో ప్రైజ్ మనీ వచ్చింది. ఓటమి పాలైనప్పటికీ భారత్‌కు భారీ మొత్తం లభించింది.

ఆస్ట్రేలియాకు రూ.13.2 కోట్లు
ఆస్ట్రేలియాకు ఈ విజయంతో దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో టీమ్ ఇండియా రూ.6.5 కోట్లు దక్కించకుంది. వీరితో పాటు టాప్ 9 జట్లకు కూడా మంచి మొత్తం దక్కింది. ఆదివారం లండన్‌లోని ఓవల్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2014 తర్వాత ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌కు ఇది నాలుగో ఓటమి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు కోసం ICC 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. దీని ప్రకారం ఆస్ట్రేలియాకు దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో ఫైనల్‌లో ఓటమి చవి చూసిన టీమిండియా దాదాపు రూ.6.5 కోట్లు దక్కించుకుంది.

ఇవి కాకుండా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.3.72 కోట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రూ. 2.89 కోట్లు దక్కించుకుంది. ఐదో నంబర్‌లో ఉన్న శ్రీలంకకు రూ. 1.65 కోట్లు లభించాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ
ఆస్ట్రేలియా - రూ. 13.2 కోట్లు
భారత్ - రూ.6.5 కోట్లు
దక్షిణాఫ్రికా - రూ. 3.72 కోట్లు
ఇంగ్లండ్ - రూ.2.89 కోట్లు
శ్రీలంక - రూ.1.65 కోట్లు

అలాగే ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌పై ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధించి గదను కూడా సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవి చూసింది. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీల ఆకలి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది.

1987, 1999, 2003, 2007, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకుంది. 2006, 2009 సంవత్సరాల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2021లో అందని ద్రాక్షగా నిలిచిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా దక్కించుకుంది. ఇప్పుడు 2023లో భారత్‌పై గెలిచి ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా కూడా నిలిచింది.

ఇక భారత్ విషయానికి వస్తే... 1983, 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకుంది. కానీ 2013లో విజేతగా నిలిచింది. 2010, 2011, 2017, 2018, 2019 సంవత్సరాల్లో టెస్టు ఛాంపియన్ షిప్ గదను గెలుచుకుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధిస్తే అన్ని ట్రోఫీలూ గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచేది.

Published at : 11 Jun 2023 07:18 PM (IST) Tags: Team India India vs Australia World Test Championship Final

ఇవి కూడా చూడండి

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs South Africa : సఫారీలతో తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

India vs South Africa : సఫారీలతో  తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్