అన్వేషించండి

ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!

ODI World Cup: ఐసీసీ పెద్దలు పాకిస్థాన్‌కు వెళ్లారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ కచ్చితంగా ఆడేలా హామీ తీసుకోబోతున్నారు. ఆసియాకప్‌తో సంబంధం లేకుండా భారత్‌లో ఆడేలా ఒప్పిస్తారని సమాచారం.

ODI World Cup 2023: 

ఐసీసీ పెద్దలు పాకిస్థాన్‌కు వెళ్లారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ కచ్చితంగా ఆడేలా హామీ తీసుకోబోతున్నారు. ఆసియాకప్‌తో సంబంధం లేకుండా భారత్‌లో ఆడేలా ఒప్పిస్తారని సమాచారం. ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే, సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ ఇప్పటికే లాహోర్‌ వెళ్లి పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీని కలిశారని కొన్ని వర్గాలు పీటీఐకి తెలిపాయి.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముందు ఆసియాకప్‌ ఉంటుంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల్ని పీసీబీ సొంతం చేసుకుంది. దాంతో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా అడుగు పెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు. న్యూట్రల్‌ వెన్యూలో ఆడించాలని అంటున్నారు. అయితే హిట్‌మ్యాన్‌ సేన పాక్‌లో ఆడకపోతే పాక్‌ వన్డే ప్రపంచకప్‌ ఆడదని పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ స్పష్టం చేశారు. ఒక హైబ్రీడ్‌ మోడల్‌ను ప్రతిపాదించారు.

'పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడల్‌ గురించి వన్డే ప్రపంచకప్‌ హోస్ట్‌ బీసీసీఐ, ఐసీసీ ఆలోచిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఆసియాకప్‌ గురించి దీనిని ప్రతిపాదించారు. ఒకవేళ దీనికి అంగీకరించినా పీసీబీ మళ్లీ బెదిరింపులకు దిగొచ్చు. భారత్‌లో ప్రపంచకప్‌ ఆడబోమని, ఇలాంటి మోడల్‌కే పట్టుబట్టొచ్చని ఐసీసీ అనుమానం' అని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.

'ఐసీసీ, బీసీసీఐ ఇలాంటి తలనొప్పి కోరుకోవడం లేదు. వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ ఉపఖండంలో పర్యటించాలనే కోరుకుంటున్నాయి. అలాంటప్పుడే ఐసీసీ ఈవెంట్‌ విజయవంతం అవుతుంది. దాయాదుల సమరానికి అవకాశం ఉంటుంది' అని మరొకరు తెలిపారు.

ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు అంగీకరిస్తే పాకిస్థాన్‌ మళ్లీ మళ్లీ ఇలాగే బెదిరింపులకు దిగొచ్చని జేషా భావిస్తున్నారు. అందుకే దీనికి అంగీకరించడం లేదు. 4 మ్యాచులు పాకిస్థాన్‌లో మిగిలిన మ్యాచులు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాగా టోర్నీని తటస్థ వేదికకు మారిస్తే పాకిస్థాన్‌ అందులో ఆడబోదని నజమ్‌ సేథీ స్పష్టం చేస్తున్నారు. కనీసం కొన్ని మ్యాచులైనా తమ దేశం ఆతిథ్యం ఇవ్వకపోతే ప్రపంచకప్‌లో విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

'బీసీసీఐ, పీసీబీ మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఐసీసీ అధికారులు శ్రమిస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ టోర్నీలను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్నారు' అని ఐసీసీ వర్గాలు తెతెలిపాయి.

ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌, ఆస్ట్రేలియా ప్రిపరేషన్స్‌ మొదలు పెట్టాయి. ఆదివారం రెండు బోర్డులు ఐసీసీకి తుది ఆటగాళ్ల జాబితాలను సమర్పించాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టులో మార్పులు చేయగా బీసీసీఐ అలాగే ఉంచింది.

టీమ్‌ఇండియా జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది.

భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget