అన్వేషించండి

World Cup Prize Money: ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం, భారీ ప్రైజ్ మనీ ప్రకటన

ICC T20 World Cup: ప్రపంచకప్ లలో మహిళల ప్రైజ్ మనీని పురుషుల ప్రైజ్ మనీతో సమంగా ఇస్తామన్న ఐసీసీ చారిత్రాత్మక ప్రకటనతో ప్రైజ్ మనీ గత ప్రపంచకప్ తో ఏకంగా 225 శాతం పెరిగింది.

ICC announces equal prize money for men's and women's World Cups:  మహిళల క్రికెట్(Cricket) కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు... సభ్య దేశాలకు మరింత ఉత్సాహాన్నిచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC )కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ(equal prize money) అందిస్తామని ప్రకటించింది. వచ్చే నెల జరగనున్న మహిళల టీ 20 ప్రపంచకప్ నుంచే ఈ పెంచిన ప్రైజ్ మనీ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీని సమం చేస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది చారిత్రాత్మక నిర్ణయమని పలువురు మాజీ క్రికెటర్లు కొనియాడారు. 

ఎంత పెరిగిందంటే
 ప్రపంచకప్ లలో మహిళల ప్రైజ్ మనీని పురుషుల ప్రైజ్ మనీతో సమంగా ఇస్తామన్న ఐసీసీ చారిత్రాత్మక ప్రకటనతో ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. గత ప్రపంచకప్ తో పోలిస్తే వచ్చే నెల జరగనున్న టీ 20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఏకంగా 225 శాతం పెరిగింది. టీ 20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ ఇప్పుడు రూ. 66.64 కోట్లకు పెరిగింది. ఈసారి టీ 20 ప్రపంచకప్ ను గెలిచిన జట్టుకు రూ.19.60 కోట్లు దక్కనున్నాయి. అమెరికా- వెస్టిండీస్ నిర్వహించిన పురుషుల టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ.20.52 కోట్లు దక్కాయి. ఈసారి దాదాపుగా టీ 20 ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు కూడా దాదాపుగా అదే మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఐసీసీ కీలక ప్రకట

"ఐసీసీ మహిళల టి 20 ప్రపంచ కప్ 2024 ఆరంభం వేళ కీలక నిర్ణయం తీసుకున్నాం. పురుషులకు ఇస్తున్నట్లే మహిళలకు సమానంగా ప్రైజ్ మనీ ఇస్తాం. ఇది క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి." అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. "జులై 2023లో జరిగిన ICC వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాం. 2030 షెడ్యూల్ కంటే ఏడేళ్ల ముందుగానే ICC బోర్డు... ప్రైజ్ మనీని సమం చేయాలన్న నిర్ణయాన్ని అమలు చేసి గొప్ప ముందడుగు వేసింది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంటలో ఇక ప్రైజ్ మనీ కూడా సమంగా దక్కుతంది" అని ఐసీసీ ప్రకటించింది.ప్రపంచకప్ లో ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.9 కోట్లు దక్కుతాయి. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు రూ. 5.65 కోట్లు అందుకుంటాయి. గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జట్లు 31 వేల డాలర్లు అందుకుంటాయి. 

Read Also: ఆసియాలో భారత్ ను ఆపే జట్టుందా, అయిదోసారి కప్పు మనదే


ఎప్పటినుంచంటే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్‌ అక్టోబరు 3 నుంచి 20 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉన్నా అక్కడి హింసాత్మక వాతావరణం నేపథ్యంలో దానిని యూఏఈకి తరలించారు. ఈ టోర్నమెంట్ ను మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి  మొదటి రెండు స్థానాల్లో  నిలిచిన టీమ్‌లు సెమీ ఫైనల్ కు చేరతాయి. గ్రూప్‌ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక ఉండగా గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.  ఇక భారత జట్టు  అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. దాయాది జట్లు  భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరగనుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.