By: ABP Desam | Updated at : 03 Dec 2022 07:13 PM (IST)
Edited By: nagavarapu
దీపక్ చాహర్ (source: twitter)
Deepak Chahar: మలేషియన్ ఎయిర్ లైన్స్ పై భారత బౌలర్ దీపక్ చాహర్ మండిపడ్డాడు. వారి విమాన ప్రయాణంలో తాము ఇబ్బందులు పడ్డామని తెలిపాడు. దారుణమైన అనుభవాన్ని చవిచూశామని చాహర్ ట్వీట్ చేశాడు. అసలింతకీ ఏం జరిగిందంటే...
న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. దీనికోసం కివీస్ పర్యటన ముగిసిన తర్వాత అక్కడ ఆడిన దీపక్ చాహర్, శిఖర్ ధావన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ కివీస్ నుంచి ఢాకాకు మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో వచ్చారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీంతో కలిశారు.
అయితే ఈ ప్రయాణంలో తాము ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చాహర్ తెలిపాడు. ‘మలేషియన్ ఎయిర్లైన్స్లో దారుణమైన అనుభవం ఇది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా మా విమానాన్ని మార్చారు. బిజినెస్ క్లాస్లో మాకు ఆహారం అందించలేదు. ఇక మేం మా లగేజ్ కోసం 24 గంటలుగా వేచి చూస్తున్నాం. రేపు మాకు మ్యాచ్ ఉంది. మా పరిస్థితిని ఊహించుకోండి’ అంటూ చాహర్ శనివారం ట్రైనింగ్ సెషన్కు ముందు ట్వీట్ చేశాడు. దీనిపై మలేషియన్ ఎయిర్లైన్స్ కంప్లైంట్ లింక్ పంపించగా.. అది ఓపెన్ కావడం లేదని చాహర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ మార్పుకు సంబంధించి విమానయాన సంస్థ బదులిచ్చింది. ‘అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. వాతావరణ, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగింది’ అంటూ పేర్కొంది.
Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022
రేపట్నుంచి బంగ్లాతో వన్డే సిరీస్
టీమిండియా రేపట్నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. బంగ్లాకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. అలానే బంగ్లాతో వన్డే మ్యాచులకు టీం మేనేజ్ మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ సేన్ లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో భారత్ కాగితంమీద బలంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోనున్నారు. మరి అందులో ఎంతమేర సఫలీకృతమవుతారో చూడాలి.
The two Captains unveil the ODI series trophy on the eve of the 1st ODI at SBNCS, Mirpur.#BANvIND #TeamIndia pic.twitter.com/h08tPXn69b
— BCCI (@BCCI) December 3, 2022
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్ను నిర్ణయించే సిరీస్!
Suryakumar Yadav: ఒక్క భారీ ఇన్నింగ్స్తో ఐదుగురి రికార్డులు అవుట్ - సూర్య ఇది చేయగలడా?
Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్గా విరాట్!
Murali Vijay Records: భారత ఓపెనర్గా మురళీ విజయ్ ప్రత్యేక రికార్డు - ఓపెనర్లలో నాలుగో స్థానంలో!
Suryakumar Yadav: నా బ్యాటింగ్కు అతనే కారణం - సూర్య చెప్పిన పేరు ఎవరిది?
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?