![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?
IPL 2024 Auction: పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు.
![IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర? Australias ODI World Cup champions enter 2024 IPL auction at highest base price IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/02948ff2077232457350a2d9e9fa864e1701493014259872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ (World Cup) ముగిసిందో లేదో దేశంలో ఐపీఎల్(IPL) సందడి మొదలైంది. ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెల 19న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు. ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, కమిన్స్, స్టార్క్, హాజిల్వుడ్ తమ కనీస ధర రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మంచి ధర పలికే అవకాశముంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో ఆసీస్ ఆరోసారి టైటిల్ గెలువడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే వేలంలో ఈ ఆసీస్ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు.
భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, బ్యాటర్ కేదార్ జాదవ్లు ఈ జాబితాలోనే ఉన్నారు. ప్రపంచకప్లో సత్తా చాటిన కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలుగా నిర్ణయించాడు. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి అతడు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. 1166 మంది క్రికెటర్ల జాబితాను ఐపీఎల్.. ఫ్రాంఛైజీలకు పంపింది. ఈ 11 వందల 66 మంది కోసం ప్రాంచైజీలు 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇందులో ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించిన వారితో తుది జాబితాను రూపొందిస్తారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్గా నిలిచింది. ఈ లీగ్లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సైతం ఈ లీగ్లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. ఎట్టకేలకు గత సీజన్లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ తరహా లీగ్లు జరుగుతాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్పై అధికారిక ప్రకటన రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)