అన్వేషించండి

IND vs WI: ఇదేం కూర్పు? - తొలి టీ20లో టీమిండియా ఫైనల్ లెవన్‌పై మాజీల విసుర్లు

వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత జట్టు ఆటతీరు కంటే జట్టు కూర్పుపైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.

IND vs WI: వెస్టిండీస్‌తో గురువారం ముగిసిన  తొలి టీ20లో భారత జట్టు ఓటమిలో  బ్యాటింగ్ వైఫల్యం కంటే కూడా టీమ్ కాంబినేషన్  బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   సీనియర్ ఆటగాళ్లు, మాజీలు ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన  మ్యాచ్‌లో  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు పూర్తి కోటా ఇవ్వకపోవడం.. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడిని తీసుకోకపోవడం వంటివాటిపై మాజీలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యుజీకి నాలుగు ఓవర్లు ఇవ్వరా..?

ట్రినిడాడ్ వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత బౌలర్లు తొలుత విండీస్‌ను 149 పరుగులకే కట్టడిచేశారు. అయితే స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు నాలుగు ఓవర్ల పూర్తి కోటా  ఇవ్వకుండా ఉండటం సరికాదని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో  చోప్రా మాట్లాడుతూ.. ‘కొత్త బంతితో భారత్ గొప్ప ఆరంభమేమీ ఇవ్వలేదు. అయితే యుజీ ఐదో ఓవర్లో రావడం రావడమే రెండు కీలక వికెట్లు తీశాడు.  కానీ తర్వాత అతడిని మళ్లీ 13వ ఓవర్ దాకా బరిలోకి దించలేదు.   మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి  దూకుడు మీద ఉన్న బౌలర్‌ను  నిలిపేయడం సరికాదు.  టీమిండియా ఇక్కడే ట్రిక్ కోల్పోయింది. అదీగాక  యుజీకి  పూర్తి ఓవర్ల కోటా కూడా ఇవ్వలేదు.  అతడు 3 ఓవర్లే బౌలింగ్ చేశాడు.  ఇది నాకు నిరాశ కలిగించింది. నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నప్పుడు చాహల్‌కు బంతినివ్వలేదు.  వాస్తవానికి లెఫ్ట్ హ్యాండర్లు చాహల్ ను ఎదుర్కోవడం కష్టం. కానీ హార్ధిక్ మాత్రం అతడిని మళ్లీ 13వ ఓవర్ దాకా బరిలోకి దించలేదు.   కుల్దీప్, అర్ష్‌దీప్‌లు తమ కోటాను పూర్తి చేశారు. అక్షర్ పటేల్ రెండు ఓవర్లే వేశాడు. పూరన్ ధాటిగా ఆడుతున్నప్పుడు అతడిని కట్టడి చేసేందుకు  చాహల్‌ను  బరిలోకి దింపితే బాగుండేది..’ అని  చోప్రా చెప్పాడు. 

లోయరార్డర్‌లో బ్యాటర్లే లేకుంటే ఎలా..? 

విండీస్‌ను 149 పరుగులకే కట్టడి చేసినా  వాటిని  ఛేదించడానికి భారత జట్టు నానా తంటాలు పడింది. వరుస క్రమంలో వికెట్లను కోల్పోవడంతో  నాలుగు పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఓపెనర్లు వైఫల్యం చెందగా  కొత్త కుర్రాడు తిలక్ వర్మ - సూర్యకుమార్ యాదవ్‌లు  భారత్‌ను ఆదుకున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.  చేయాల్సిన పరుగులు తక్కువే ఉన్నా  భారత లోయరార్డర్ వాటిని కూడా  ఛేదించలేకపోవడంపై   భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్  స్పందిస్తూ.. ‘టీమిండియాలో 8,9,10 వ స్థానాల్లో ఉన్న ఆటగాళ్లలో బౌండరీ కొట్టే వాళ్లే లేరు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది పెద్ద  లోటు. మీరు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లను తీసుకుంటే వాళ్ల చివరి వరుస బ్యాటర్లు కూడా టీమ్ కోసం ఎంతోకొంత  పరుగులు కూడబెడుతారు. ఈ విషయంలో భారత జట్టు  మాత్రం  చాలా వెనుకబడి ఉంది.  ఇది టీమ్ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది.  కుల్దీప్ యాదవ్‌ను 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం రైట్ ఛాయిస్ కాదు’అని వ్యాఖ్యానించాడు.  తొలి మ్యాచ్‌లో ఓటమి ద్వారా  భారత జట్టులో సరిదిద్దుకోవాల్సిన లోపాలు చాలా తెలిసాయని వచ్చే మ్యాచ్‌లలో అయినా వాటి పట్ల దృష్టి సారిస్తే మంచిదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
Viral Video: రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Embed widget