అన్వేషించండి

Chahal Test Covid 19 Positive: టీమిండియాలో కరోనా కలకలం... చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌కు కరోనా పాజిటివ్

లంకలో పర్యటిస్తోన్న భారత జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. తాజాగా యుజ్వేంద్ర చాహల్,  క్రిష్ణప్ప గౌతమ్‌ పాజిటివ్‌గా తేలారు.

లంకలో పర్యటిస్తోన్న భారత జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. తాజాగా భారత్ ఆటగాళ్లు యుజ్వేంద్ర చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. దురదృష్టవశాత్తూ టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ కృనాల్ పాండ్యకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లు. వీరు జట్టుతో కలిసి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

రెండు రోజుల క్రితం భారత్ X శ్రీలంక మధ్య రెండో టీ20కి ముందు భారత ఆటగాళ్లకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల్లో కృనాల్ పాండ్య కరోనా పాజిటివ్‌గా తేలాడు. వెంటనే అప్రమత్తమైన జట్టు మేనేజ్‌మెంట్ కృనాల్ పాండ్యతో పాటు అతడితో క్లోజ్‌గా ఉన్న 8మంది ఆటగాళ్లను గుర్తించి ఐసోలేషన్ చేశారు. వారిలో హార్దిక్ పాండ్య, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్ చాహర్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ ఉన్నారు. అలాగే మిగతా ఆటగాళ్లందరికీ RT-PCR టెస్టులు చేయించారు. అదృష్టవశాత్తూ మిగతా వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య 27న జరగాల్సిన T20ని తర్వాతి రోజుకు వాయిదా వేశారు. జట్టు మేనేజ్‌మెంట్ తాజాగా ఐసోలేషన్లో ఉన్న వారికి మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు ఉంది. ఇందులో చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. 

దీంతో లంకలో భారత పర్యటన ముగిసినట్లే. షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు ఈ రోజు భారత్‌కు బయలుదేరాలి. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ ఎనిమిది మంది భోజనం చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారమే ఆ 8 మందికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధ, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకీ ఆ 8 మందిని ఆడించలేదు. ఇరు జట్ల మధ్య గురువారంతో మూడు T20ల సిరీస్ ముగిసింది. 2-1తేడాతో లంక సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను గబ్బర్ సేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.   

మరో‌పక్క ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సిన పృథ్వీ షా, సూర్యకుమార్‌  పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న వీళ్లు మరో రెండు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్ వచ్చిన తర్వాతే ఇంగ్లాండ్ బయల్దేరతారు. ఆగస్టు 4 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికు కోహ్లీ సేన ఇంగ్లీష్ గడ్డపై ఐసోలేషన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
Tamil Nadu Vijay: తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
Steve Smith Records: 96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
Embed widget