News
News
X

IND vs AUS: కుంబ్లేను దాటేసిన లియాన్ - ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నాథన్ లియాన్ నిలిచాడు.

FOLLOW US: 
Share:

India vs Australia Indore Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ ఇండోర్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 76 పరుగుల విజయ లక్ష్యం లభిచింది. రెండో రోజు వరకు భారత జట్టుపై ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో నాథన్ లియాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను అనిల్ కుంబ్లే పాత రికార్డును బద్దలు కొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లియాన్ నిలిచాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో లియాన్ ఇప్పటివరకు మొత్తం 113 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. కుంబ్లే ఈ సిరీస్‌లో 111 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ 106 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ 95 వికెట్లతో నాలుగో స్థానంలోనూ, రవీంద్ర జడేజా 84 వికెట్లతో ఐదో స్థానంలోనూ ఉన్నారు.

ఇండోర్ టెస్టులో నాథన్ లియాన్ సమర్థవంతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ సమయంలో 11.2 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను రెండు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ లియాన్‌దే ఆధిపత్యం. 23.3 ఓవర్లలో నాథన్ లియాన్ కేవలం 64 పరుగులు మాత్రమే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. లియాన్ మొత్తం భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు.

విశేషమేమిటంటే ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అనంతరం రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో విజయం అంత సులువు కాదు. ఆస్ట్రేలియా గెలవాలంటే కేవలం 76 పరుగులే చేయాల్సి ఉంది. వారి దగ్గర మొత్తం 10 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కంగారూ జట్టును టీమిండియా కుప్ప కూల్చాల్సి ఉంటుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
నాథన్ లియోన్ - 113 వికెట్లు
అనిల్ కుంబ్లే - 111 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ - 106 వికెట్లు
హర్భజన్ సింగ్ - 95 వికెట్లు
రవీంద్ర జడేజా - 84 వికెట్లు

ఇండోర్ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 76 పరుగుల విజయ లక్ష్యం లభించింది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు చతేశ్వర్ పుజారా. చతేశ్వర్ పుజారా 142 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

ఇది కాకుండా శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవాలంటే 76 పరుగులు చేయాలి. అయితే భారత జట్టు అద్భుతం చేయగలదా? 76 పరుగుల ముందు కంగారూలను ఆపగలరా?

ఇండోర్ టెస్టులో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా 76 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. ఆస్ట్రేలియా ఓపెనర్లను వీలైనంత త్వరగా అవుట్ చేయాలని భారత జట్టు కోరుకుంటోంది. నిజానికి ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు బాగా ఇబ్బంది పడ్డారు. భారత బౌలర్లు టాప్ ఆర్డర్‌ను ముందుగానే పెవిలియన్‌కు పంపగలిగితే మ్యాచ్ ట్రెండ్ మారవచ్చు.

Published at : 02 Mar 2023 11:59 PM (IST) Tags: Team India India vs Australia Indore Test

సంబంధిత కథనాలు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌