By: ABP Desam | Updated at : 19 Mar 2023 10:11 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pixabay
ఏడు (7) అంకెకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఏడును పవిత్రమైన అంకెల్లో ఒకటిగా భావిస్తారు. సంస్కృతంలో ఏడును సప్త అంటారు. ఎన్నో దైవిక భావనలకు, వేదాంత సిద్ధాంతాలకు ఏడు ప్రతీకగా నిలుస్తోంది.
వారంలో రోజులు ఏడు. ఇంద్రధనస్సులో రంగులు ఏడు, స్వరాలన్నీ కలిసి సప్త స్వరాలుగా మనందరికీ తెలుసు. సప్తతి అంటే డెబ్బై అని అర్థం. సప్తక అంటే ఏడుగురు మనుషుల సమూహం. సప్తాహం అంటే వారం రోజుల కార్యక్రమం. హిందుత్వంలో ఏడుతో ముడి పడి ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం.
యోగ శాస్త్ర ప్రకారం మన శరీరంలో ఉండే చక్రాలు ఏడు. వీటినే శక్తి స్థానాలుగా పరిగణిస్తారు.
హిందువులకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత కలిగిన ఏడు పట్టణాలు ఉన్నాయి. అవి అయోధ్య, మధుర (ఉత్తరప్రదేశ్), కాశీ (వారణాశీ) కంచి (కాంచీపురం), అవంతిక (ఉజ్జయిని), ద్వారక (ద్వారకావతి), మాయాపురి (హరిద్వార్)
ఈ విశ్వంలో 14 లోకాలు (చతుర్దశ భువనాలు) ఉన్నట్టు చెబుతారు. భూమితో సహా పైన ఏడు కింద ఏడు లోకాలు ఉన్నట్టుగా హిందుమత విశ్వాసం. భూమి పైన ఉండే వాటిని ఊర్థ్వలోకాలు అంటారు. ఇవి భూ లేదా భూర్ లోక (భూమి), భువర్ లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకా, సత్యలోకాలు ఉండగా, భూమి కింద (అధోలోకాలు) అతల, విఠల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటాయి.
సప్తఋషులు అనేది వేద జ్ఞానాన్ని, పవిత్ర గ్రంథాలలో ఉన్న విషయాలను ఇహలోక చైతన్యాన్ని అందించడానికి బాధ్యత తీసుకున్న గొప్ప ఋషులను సప్త ఋషులుగా పరిగణిస్తారు. ప్రతి మన్వంతరానికి ఈ ఏడుగురు ఋషుల కూటమి ఉంటుంది .స్వయంభువ మన్వంతరంలో వారు మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులాహ, క్రతువు, వశిష్ట అని వీరు ఏడుగురు ఋషులు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. ఇప్పుడు కొనసాగుతున్న వైవస్వత మన్వంతరంలో అత్రి, వశిష్ట, కాష్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని అనే ఋషుల కూటమి ఉంది. సప్తఋషి మండల ఏడు నక్షత్రాల సమూహం. ఇది భూమికి ఉత్తర దిశలో స్పష్టంగా కనిపిస్తుంది. గాలిపటం ఆకారంలో ఉంటుంది.
మానవ శరీరం సప్తధాతు నిర్మితం. అవి రస (ద్రవ), రక్త (రక్తం), మాంస (మాంసం), మేడ (కొవ్వు), అస్థి (ఎముకలు), మజ్జా (మజ్జ), శుక్ర (వీర్యం). ఏడు లోహ పదార్థాలు సువర్ణ (బంగారం), రజత (వెండి), కాంస్య (కాంస్య), తామ్ర (రాగి), సీసా (లెడ్), వంగా (టిన్), లోహ (ఇనుము) అని సప్త లోహాలు.
ఇవి మాత్రమే కాదు వివాహంలో అగ్ని చుట్టూ చూసే ఏడు ప్రదక్షిణలు సప్తపది, దేవీ లీలలు వివరించే ఏడు వందల శ్లోకాలు సప్తశతి, దుర్గా దేవి ఏడు అవతారాలు సప్తమాతృక, సూర్య జయంతం రథ సప్తమి, ఆయన రథానికి అశ్వాలు ఏడు, అందుకే సప్తాశ్వ రథ మారూఢం అని కొలుస్తారు. ఉత్తర క్రియల్లో ఏడు విధాలు దానిని సప్తాన అంటారు. ఏడు రకాల వ్యసనాలను సప్తవ్యసనాలని చెప్పారు. వారంలో ఏడవ రోజు శని వారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత ఏడో రోజు సప్తమి సాధారణంగా పవిత్రమైన తిథి. దీనిని భద్ర తిథి అంటారు. ఈ తిథి ఆదివారం రోజున వస్తే భాను సప్తమిగా పరిగణిస్తారు.
మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం
యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం
వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా