అన్వేషించండి

Krishna Janmashtami 2021: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

అందంగా లేనా అని అడగని ఆడపిల్ల ఉండదేమో. అది పురాణాల్లో అయినా…ప్రస్తుతం అయినా... ద్వాపరయుగంలో ఓసారి సత్యభామ…శ్రీకృష్ణుడిని ఇదే ప్రశ్న అడిగిందట. అప్పుడు కన్నయ్య ఏం సమాధానం చెప్పాడో తెలుసా....

శ్రీకృష్ణుని అష్టభార్యల్లో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన గుర్తింపు దక్కించుకుంది. వీరనారిగా, సరస శృంగారాభిమానవతిగా, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిలా సత్యభామ పాత్రను చిత్రీకరించారు. పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యంగా చెప్పారు.

పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్


Krishna Janmashtami 2021: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

అర్థమయ్యేలా చెప్పాలంటే నరకునితో యుద్దం చేసే సమయంలో… ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగా, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగా ఒకేమారు దర్శనమిచ్చిందట. అంత అందమైన సత్యభామకి అంహకారం కూడా అంతకుమించే ఉందని పారిజాతాపహరణంలో చెబుతారు.అయితే ఓసారి సత్యభామకి ఓ సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడిని ఉద్దేశించి స్వామీ.. రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’అని అడిగింది.

అక్కడే ఉన్న గరుత్మంతుడు ప్రభూ నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించ గలరా అన్నాడు

పక్కనే ఉన్న సుదర్శన చక్రం కూడా…‘పరంధామా...ఎన్నో యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాలు తెచ్చిపెట్టాను నాతో సరితూగేవారెవ్వరు అన్నది…

ముగ్గురి మాటల విన్న శ్రీకృష్ణుడు వారికి సరైన సమాధానం చెప్పాలనుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించిన నందగోపాలుడు … సత్యా నువ్వు సీతగా మారిపో నేను రాముడినవుతా అన్నాడు. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కొనిరా…సుదర్శన చక్రమా…నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు అని ముగ్గురికీ మూడు బాధ్యతలు అప్పగించాడు.

Also read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే
Krishna Janmashtami 2021: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

గరుత్మంతుడు వెంటనే హనుమంతుని వద్దకు వెళ్లి..సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. ఆనందంతో పులకించిపోయిన ఆంజనేయుడు నేను నీవెనుకే వస్తాను నువ్వు పద అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు ….ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలం అవుతుందో అనుకుంటూ రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. అయితే అంతకు ముందే ఆంజనేయుడు ద్వారక చేరడం చూసి గరుత్మంతుడు సిగ్గుతో తలదించుకుంటాడు.


Krishna Janmashtami 2021: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం

ఇంతలో హనుమా అన్నపిలుపు విని రాముడివైపు చూసిన వాయుపుత్రుడితో… లోపలకి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’ అని అడగ్గా.. నోటి నుంచి చక్రాన్ని తీసి…ప్రభూ ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో నోట్లో పెట్టుకుని మీ ముందుకొచ్చా అన్నాడు. అప్పుడు సుదర్శనుడు కూడా నేలచూపులు చూడకతప్పలేదు. ఇంతలో రాముడి పక్కనున్న స్త్రీని చూసిన ఆంజనేయుడు… ‘స్వామీ మీ పక్కన ఉండాల్సింది నా తల్లి సీతమ్మ కదా…ఈవిడ ఎవరు అన్నమాట విని సత్య భామకు కూడా గర్వ భంగమైంది. అలా కృష్ణుడు ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికి ఉన్న విలువేంటో తెలియజేశాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget