అన్వేషించండి

Mahakumbh 2025 : కుంభమేళాలో స్నానఘాట్ కి వెళ్లొచ్చేందుకు ఎంత సమయం పడుతోందో తెలుసా.. మొదటి 4 రోజుల్లో ఎన్ని విశేషాలో!

Prayagraj Mahakumbh 2025 : జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహాకుంభమేళా ఈ రోజుకి( జనవరి 16) నాలుగు రోజులు పూర్తిచేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఎన్నో విశేషాలు.. అవేంటో చూసేయండి...

Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్ మహాకుంభాన్ని సందర్శించే ప్రతి భక్తులు స్నాన ఘాట్‌లో సగటున 45 నిమిషాలు గడిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్‌ల ద్వారా సేకరించిన డేటా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుంచి  వివరాలు సేకరిస్తున్నారు. 

ఈసారి మహా కుంభమేళాకు ఎంత మంది వస్తారో తెలుసుకునేందుకు మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఒకటి RF రిస్ట్‌బ్యాండ్ డేటా విశ్లేషణ. ఇందులో భక్తులకు మణికట్టుకు కట్టుకునేందుకు రిస్ట్ బ్యాండ్ అందజేశారు. 

మకర సంక్రాంతి, పుష్య మాస పూర్ణిమ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులు ఒక్కొక్కరు సగటున 45 నిమిషాలపాటు స్నాన ఘాట్‌లో గడిపినట్లు ఆర్‌ఎఫ్ ఐడీ చిప్‌లతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ల నుంచి సేకరించిన సమాచారం వెల్లడించింది. స్నానానికి ఘాట్ కి వచ్చనప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకూ 45 నిముషాల సమయం పడుతోంది.

Also Read: ప్రయాగ్‌రాజ్‌లో విదేశీ భక్తుల సందడి- కుంభమేళా చాలా పవర్ ఫుల్, మేరా భారత్ మహాన్ అని కామెంట్స్
 
ఘాట్‌లో భక్తులు సగటున గడిపే సమయాన్ని కనుక్కోవడం రద్దీ నిర్వహణకు సహాయపడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. దీని ఆధారంగా జాతరలో భక్తుల ప్రవేశ, నిష్క్రమణలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. సాధారణ ట్రాఫిక్ ప్లాన్ ద్వారా ట్రాఫిక్ ఎప్పుడు నిర్వహించాలో మరియు అత్యవసర ట్రాఫిక్ ప్రణాళికను ఎప్పుడు అమలు చేయాలనేది నిర్ణయించవచ్చు. ఆర్‌ఎఫ్ రిస్ట్‌బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ ద్వారా లభించే ఫలితాలు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడతాయని ఎస్‌ఎస్‌పి రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు.

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన తోపులాటలో 200 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిని సెక్టార్ 2 లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. వీరిలో ఆరుగురి చేతి మణికట్టుకి గాయమైంది. ఏడుగురికి కాలువిరిగింది...మిగిలినవారికి చిన్న చిన్న గాయాలయ్యాయని హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. 

Also Read: మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
 
కుంభమేళా మొదటి నాలుగు రోజుల్లో షటిల్ బస్సుల్లో ఐదు లక్షల మంది ఉచితంగా ప్రయాణించారు. ఆదివారం ప్రారంభమైన ఈ సేవ బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. ఈ కాలంలో గరిష్టంగా 2.50 లక్షల మంది ప్రయాణించారు. మౌని అమావాస్యకు ఒకరోజు ముందు ప్రయాణికులకు షటిల్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుకగా లభిస్తుందని తెలిపారు యూపీ రోడ్‌వేస్ రీజినల్ మేనేజర్ ఎంకే త్రివేది. గురువారం నుంచి ఈ బస్సుల్లో ప్రయాణికులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 200 E బస్సులు వాటి షెడ్యూల్ చేసిన రూట్లలో నడుస్తాయి.

1932 తర్వాత మొదటిసారిగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. 1932లో ప్రయాగ్‌రాజ్ నుంచి లండన్‌కు ఒక విమానాన్ని నడిపారు. 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. అమెరికాకు చెందిన బిలియనీర్ మహిళా పారిశ్రామికవేత్త లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఈ విమానం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్‌కు వెళ్లింది. ఈసారి మహాకుంభ్ సందర్భంగా NRIలు , విదేశీ పౌరులు నేరుగా విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు రావచ్చు. ఈ కారణంగానే తొలిసారిగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులను కూడా విమానాశ్రయంలో మోహరించారు.

బుధవారం ఉదయం రాయల్ భూటాన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ కాగా.. దాన్ని చూసి ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. ఈ విమానం రాక గురించి కొందరికి మాత్రమే తెలియడంతో దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. 1932 ముందు బ్రిటీష్ పాలనలో, ప్రయాగ్‌రాజ్ నుంచి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుంచి లండన్‌కు నేరుగా విమానం ఉండేది. 93 సంవత్సరాల విరామం తర్వాత, జనవరి 15, బుధవారం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు నడిచాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget