అన్వేషించండి

Tirumala: తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం... పల్లకీల్లో విహరించిన స్వామి వారు, ఉభయదేవేరులు

తిరుమలలో ఇవాళ శ్రీవారి ప్రణయ కలహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారు, ఉభయ దేవేరులు వేరు వేరు పల్లకీల్లో విహరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు పల్లకిలో మహాప్రదక్షిణ మార్గంలో పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై ప్రదక్షిణంగా స్వామి వారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామి వారిని మూడు సార్లు తాడించారు. స్వామి వారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామి వారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా-స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

Tirumala: తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం... పల్లకీల్లో విహరించిన స్వామి వారు, ఉభయదేవేరులు

Also Read: శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో 502 దేవాలయాల నిర్మాణం 

టీటీడీ ఆధ్వర్యంలో  వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 502 వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించామని టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలో వెయ్యి మంది వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఫిషర్ మెన్ కాలనీల్లో ఆలయాలను అధికంగా నిర్మించామన్నారు. ఆ ప్రాంతంలోని దేవాలయాల నిర్వహణకు అదే కులానికి సంబంధించిన వారికి వేదాలు నేర్పించి అర్చకులుగా నియమించామన్నారు. గత బ్రహ్మోత్సవంలో రాష్ట్రంలోని వెనుకబడిన వారిని తిరుమలకు తీసుకుని వచ్చి శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ద్వారా దర్శనం 10 రోజుల పాటు అందుబాటులో ఉందని, ఈ నేపథ్యంలో  వెనుకబడిన షెడ్యూల్ కులాల వారికి వైకుంఠ దర్శనాలు కల్పించే ప్రయత్నం చేసామన్నారు. 13 జిల్లాల నుంచి సమరస ఫౌండేషన్ సహకారంతో భక్తులను ఎన్నిక చేసి స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా నుంచి వెయ్యి మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని తెలిపారు. 

Tirumala: తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం... పల్లకీల్లో విహరించిన స్వామి వారు, ఉభయదేవేరులు

Also Read:  ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget