![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. నేటి నుంచి జనవరి 31 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.
![AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు AP Night Curfews starts from today to January 31 medical services exempt AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/18/ae340e27ef4e9daf8a9bf357e3fa8758_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ ఆంక్షల నుంచి ఆసుపత్రులు, మెడికల్ షాపులు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సర్వీసులు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి ప్రయాణాలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: ఏపీలో కరోనా కల్లోలం.... కొత్తగా 6996 కోవిడ్ కేసులు, 4గురు మృతి
మాస్కు తప్పనిసరి
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలుచేయాలని, సీటు విడిచి సీటు మార్కింగ్ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, కార్యక్రమాల్లో 200 మంది మించరాదని షరతులు విధించింది. ఆర్టీసీతో సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది.
Also Read: కొవిడ్ పరీక్ష కేంద్రాలి పెంచాలి.. పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరికాదు
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,055 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో నలుగురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,514కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,066 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,762 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 36108 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: Case On PVP : డీకే అరుణ కుమార్తె ఇంటి గోడను కూలగొట్టించిన వైఎస్ఆర్సీపీ నేత పీవీపీ .. కేసు నమోదు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)