అన్వేషించండి

Spirituality: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!

Shiva : ఏ ఆలయానికి వెళ్లినా నేరుగా గర్భగుడిలో కొలువైన స్వామి-అమ్మవార్లను దర్శించకుంటాం. కానీ..శివాలయానికి వెళితే మాత్రం నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు...ఎందుకలా!

Spirituality: శివాలయంలోకి వెళ్లగానే శంకరుడి కన్నా ముందు ధ్వజస్తంభం ఆ తర్వాత నంది కనిపిస్తాయి. నంది కొమ్ముల మధ్యలోంచి భోళాశంకరుడిని దర్శించుకుంటారు. అందరి దేవుళ్లను నేరుగా దర్శనం చేసుకుంటాం కదా..మరి పరమేశ్వరుడిని మాత్రం నంది కొమ్ముల మధ్యలోంచి ఎందుకు దర్శించుకోవాలి? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి?

గోమాత భూమికి ప్రతిరూపం

వృషభం ధర్మానికి మరోరూపం

ధర్మానికి 4 పాదాలుంటాయి...అవే సత్యం, తపస్సు, శౌచం, నియమం...

సత్యం అంటే మనసు, ఆలోచన, దృష్టి, చేసేపని సత్యంతో నిండి ఉండడం

శౌచం అంటే మనసు, ఆలోచన, దృష్టి, చేసేపనిలో పవిత్రత నిండి ఉండడం

తపస్సు అంటే ఏ విషయంలో అయినా ఏకాగ్రతతో ఉండడం

నియమం అంటే..పద్ధతి తప్పకపోవడం...

వీటికి స్వరూపం నందీశ్వర రూపం...అందుకే మనిషిలో ఉండే పశుతత్వాన్ని తొలగించి..ఈ నాలుగు పాదాల్లో నడిచేలా దీవించమని ఆ శంకరుడిని వేడుకోవడమే నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి చేసే నమస్కారం. కొమ్ములు పట్టుకుని వెనుక తోకపై చేయి పెట్టి ఆ భగవంతుడిని దర్శించుకుంటూ.. స్వామీ నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను అని మాటివ్వడమే. 

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

లింగ రూపంలో ఉన్న శంకరుడి రూపం నందీశ్వరుడి కొమ్ముల మధ్యనుంచి సంపూర్ణంగా దర్శనమిస్తుంది. ఆ దర్శన సమయంలోనే నందీశ్వరుడి చెవిలో...చెప్పుకుంటే ఆ కోర్కె శివుడి చెంతకు చేరి తీరుతుందని భక్తులవిశ్వాసం.  శంభుడు త్రినేత్రుడు అయినందున నేరుగా దర్శించుకోకూడదని..అందుకే శివుడికి పరమ భక్తుడైన నంది ద్వారా దర్శనం చేసుకుంటారని కూడా చెబుతారు. దీనినే శృంగ దర్శనం అనికూడా అంటారు. పైగా నందీశ్వరుడి కొమ్ముల మధ్యనుంచి పరమేశ్వరుడిని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణం పేర్కొంది..

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

అసలు నందీశ్వరుడు భూలోకానికి ఎలా వచ్చాడంటే!
ప్రజలంతా భగవంతుడిపై పూర్తి భక్తితో ఉండేవారు. ఆ భక్తిని చూసి కైలాశంలో ఉన్న శివయ్య మురిసిపోయాడు. ఆ సమయంలో నందీశ్వరుడిని పిలిచి  ఓ సందేశం చెప్పి ప్రజలకు చెప్పి రమ్మని భూలోకానికి పంపించాడు. ప్రతి రోజూ తలకు స్నానం చేయాలి - వారానికి ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలన్నదే ఆ సందేశం. సరే అన్న నంది భూలోకానికి వెళ్లాడు. అక్కడ ప్రజల భక్తి, సందడి చూసి తాను ఏపనిపై భూలోకానికి వచ్చాడో మరిచిపోయాడు. కొద్ది రోజులు విహరించిన తర్వాత అసలు విషయం గుర్తొచ్చి..ప్రజలకు చెప్పేసి కైలాశానికి వెళ్లిపోయాడు. స్వామీ మీరు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశానన్నాడు. ఇంతకీ ఏం చెప్పావని శంకరుడు అడిగితే... నిత్యం భోజనం చేసి వారానికోసారి తలకు స్నానం చేయమని చెప్పానన్నాడు...అంటే రివర్స్ లో చెప్పాడన్నమాట. ఆ మాట విన్న శివుడు...నిత్యం భోజనం అంటే ఎంతో పంట అవసరం అవుతుంది ఆ పంటను నువ్వే పండించు అని శిక్ష విధించాడు. అలా మనకు ఆహారాన్ని అందివ్వడంతో బసవన్న భాగమయ్యాడు. ఎద్దులా మారి దుక్కు దున్నినప్పటి నుంచి పంట చేతికందేవరకూ కష్టపడుతున్నాడు. 

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Embed widget