అన్వేషించండి

Pitru Paksham 2023: మహాలయ పక్షంలో మ‌ర‌ణిస్తే మంచిదేనా లేదంటే అశుభమా!

Pitru Paksham 2023: భూమిపై మన కాలం ముగియ‌గానే మరణం అనేది సృష్టి చట్టం. దానికి సమయం లేదు, వ్య‌వ‌ధి ఉండదు. అదే విధంగా పితృప‌క్షంలో ఎవరైనా చనిపోతే అది శుభసూచకమా.? లేక అరిష్ట సంకేతమా.?

Pitru Paksham 2023: పితృ పక్షం 15 రోజులు చాలా ప్రత్యేకమైన కాలం. ఎందుకంటే ఈ సమయంలో మరణించిన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇది వారి ఆత్మకు శాంతి చేకూర్చుతుంది, ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 14వ తేదీన ముగుస్తుంది.

పూర్వీకుల ఆశీస్సులు, అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సుఖః సంతోషాలతో ఉంటాడని చెబుతారు. పితృదేవ‌త‌ల‌ కోపానికి గుర‌యితే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పితృ పక్షంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఏమవుతుందో తెలుసా..? పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మ స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా.?                      

Also Read : పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

1. పితృప‌క్షంలో మ‌ర‌ణిస్తే శుభప్రదమా? అశుభమా?               
హిందూ ధ‌ర్మ‌ గ్రంధాలలో పితృ పక్షం గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ సమయంలో పూర్వీకులకు తర్పణం ఇవ్వడం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు తన తండ్రి దశరథుని శ్రాద్ధ క‌ర్మ‌లు నిర్వ‌హించినప్పుడు, ఆయ‌న‌ ఆత్మకు శాంతి లభించింది. పితృ పక్షంలో సంతానం కలగడం కూడా శుభప్రద‌మ‌ని చెబుతారు.  అయితే పితృ పక్షం సమయంలో ఎవరైనా మరణిస్తే అది శుభమో, అశుభమో.? ధ‌ర్మ‌ గ్రంధాల ప్రకారం, పితృ పక్షంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అది శుభప్రదంగా పరిగణించాల‌ని తెలిపారు. ఈ 15 రోజుల్లో ఎవరైనా మరణిస్తే, వారు అదృష్టవంతులని, వారి ఆత్మకు త్వరలో మోక్షం లభిస్తుందని నమ్ముతారు.     

2. స్వర్గ మార్గాలు తెరవడం        
ఒక వ్యక్తి పితృ పక్షంలో మరణిస్తే, అతనికి స్వర్గ మార్గం తెరుచుకుంటుంది. ఎందుకంటే యమ ధ‌ర్మ‌రాజు పితృ పక్షంలో 15 రోజుల పాటు స్వర్గానికి మార్గం తెరుస్తాడు. అటువంటి పరిస్థితిలో ఆత్మ నేరుగా స్వర్గానికి వెళుతుంది. వారి ఆత్మ అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందుతుంది.

Also Read : ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!

హిందూ ధ‌ర్మ‌ గ్రంధాల ప్రకారం, పితృపక్షాన్ని ఆధ్యాత్మిక పండుగగా పరిగణిస్తారు. ఈ సమయంలో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ నేరుగా తదుపరి ప్రపంచానికి వెళుతుంద‌ని నమ్ముతారు. అలాంటి ఆత్మలు మరణానంతరం స్వర్గానికి చేరుతాయి. పితృ పక్షంలో ఓ వ్యక్తి మరణించిన‌ప్పుడు అతనికి, అత‌ని కుటుంబానికీ శుభం కలుగుతుందని అర్థం. మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమ్మీద జీవాత్మగా వస్తుంది. మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి  అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

శ్రావణమాసం 2026: ఈశాన్యంలో ఈ 5 వస్తువులు పెడితే శివానుగ్రహం, సానుకూల శక్తి!
శ్రావణమాసం 2026: ఈశాన్యంలో ఈ 5 వస్తువులు పెడితే శివానుగ్రహం, సానుకూల శక్తి!
12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget