అన్వేషించండి

Simhachalam Chandanotsavam: సింహాచల చందనోత్సవానికి గంధపు చెక్కలు ఎక్కడ నుంచి తీసుకొస్తారో తెలుసా?

సింహాచలం చందనోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంటకి 3600 మందికి దర్శనం కలిగేలా అలాగే అందరికీ కదంభ ప్రసాదం, లక్షా యాభై వేల లడ్డూల ప్రసాదం దక్కేలా ఏర్పాట్లు చేశారు.

తిరుపతి వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎంత ఫేమస్సో ఉత్తరాంధ్రలో సింహాచలం అప్పన్న చందనోత్సవం కూడా అంతే ఫేమస్ . ఏడాది మొత్తం అంతా చందనంతో కప్పి ఉంచే స్వామిని ఏడాదికి ఒక్కసారి కేవలం పన్నెండు గంటలు భక్తులకు దర్శనం కల్పిస్తారు. దీనినే నిజరూప దర్శనం అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు సాధరణంగా మే  నెలలో వస్తుంది. ఆ సమయంలో లక్షకు తగ్గకుండా భక్తులు స్వామిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు చెబుతుంటారు . తిరుమల తిరుపతి దేవాస్థానం తరువాత అత్యంత ధనిక క్షేత్రంగా సింహాచలాన్ని చెబుతారు. 

వెయ్యేళ్ళ పైబడ్డ ఆలయం సింహాచలం 

చారిత్రక ఆధారాల బట్టీ, శాసనాలను బట్టీ ఈ ఆలయం 11వ శతాబ్దం ముందు నుంచీ ఉంది. అలాగే అంతకు ముందు నుంచి కూడా ఇక్కడి ఆలయంలో పూజలు నిర్వహించేవారనడానికి కూడా ఆధారాలు ఉన్నాయంటారు చరిత్రకారులు. సామాన్య శకం 1087లో ఇక్కడి ప్రధాన దైవాన్ని సింహగిరి స్వామి నరసింహదేవరగా కొలుస్తూ ఒక శాసనం ఉంది. స్వామి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం ఇది. అప్పటి నుంచే ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం నడుస్తుందని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. 

రెండు అవతారాలు కలసి ఉన్న అరుదైన దేవాలయం ఇది

సాధారణంగా ఒక వైష్ణవ దేవాలయంలో ఒకే అవతారాన్ని ప్రధాన దైవంగా కొలుస్తుంటారు. తిరుమలలో గోవిందరాజ స్వామి ఆలయం ఉన్నా అది కొండ కింద ఉంటుంది. తిరుమలలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రమే ప్రధాన క్షేత్రంగా  ఉంటుంది. అయితే సింహాచలంలో మాత్రం రెండు అవతారాలు ప్రధాన దైవాలుగా పూజలు అందుకుంటాయి. ఒకటి వరాహ నరసింహ స్వామి కాగా, రెండవది లక్ష్మీ నరసింహ స్వామి. రెండింటినీ కలిపి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడి ప్రధాన దైవంగా కొలుస్తారు. అలాగే ఆలయం మిగిలిన దేవాలయాలకు భిన్నంగా పశ్చిమాభిముఖముగా ఉండడం విశేషం. 

స్థల పురాణం 

హిరణ్య కశిపుడి నుంచి అతని కుమారుడు ప్రహ్లాదుణ్ని రక్షించడానికి అవతరించిన నరసింహ స్వామి హిరణ్య కశిపుణ్ణి అంతమొందించిన తరువాత ప్రహ్లాదుడి ఇక్కడ వరాహ నరసింహ స్వామిని ఆరాధించాడని, ఆయన తరువాత పురూరవుడు అనే రాజు స్వామికి దేవాలయం నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. స్వామి విగ్రహం నుంచి వెలువడుతున్న వేడిని చల్లార్చడానికి విగ్రహం నిండా చందనం పూసి ఉంచుతారు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ చందనం తీసివేసి మరలా కొత్త చందనం పూస్తారు. ఆ సమయంలోనే భక్తులకు నిజరూప దర్శనం లభిస్తుంది. 

నిజరూపదర్శనం అంటే ఏమిటి :

ఇక్కడ స్వామివారు 4 రూపాల్లో ఉంటారు. వరాహం, నరుడు, సింహం రూపాలు కలగలసిన అవతారం కేవలం చందనం తీసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దీన్నే నిజరూపదర్శనం అంటారు. ఈ రూపంలో వరాహ తల, మనిషి శరీరం, సింహం తోక తో త్రిభంగ ఆసనంలో వరాహ నరసింహ స్వామి అవతారం ఉంటుంది. ఇక మిగిలిన ఏడాది మొత్తం చందనంతో కప్పి ఉండే రూపం నాలుగోది. ప్రతీ ఏడూ వైశాఖ శుద్ధ తదియ నాడు కనిపించే జరిగే చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. 

చందనోత్సవం ఇలా జరుగుతుంది :

ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం కోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలుపెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా, అర్థరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే అవకాశం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకు లభిస్తుంది. 

అక్షయ తృతీయ రాత్రి వేళ వరకూ భక్తుల దర్శనం సాగిన తరువాత స్వామి వారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అటు మీదట మూడు మాణుగలు అంటే సుమారు  120 కిలోల చందనాన్ని స్వామి వారికి లేపనం చేస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు. ఇక స్వామి వారి నుంచి వలిచి చందనాన్ని భక్తులకు కానుకగా ఇస్తారు. 

అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు :

సింహాచలం చందనోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంటకి 3600 మందికి దర్శనం కలిగేలా అలాగే 
అందరికీ కదంభ ప్రసాదం, లక్షా యాభై వేల లడ్డూల ప్రసాదం దక్కేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎవరికీ ఇబ్బంది లేకుండా 
పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపార. ఓఆర్‌ఎస్ ప్యాకిట్లు, మెడికల్ క్యాంపులు భక్తులను తరలించేందుకు దేవస్థానం, ఆర్‌టిసి కలిసి సంయుక్తంగా ప్రత్యేక బస్సులు లాంటివి ఏర్పాటు చేశారు. విధుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, దేవాదాయ శాఖ అదనపు సిబ్బంది ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget