Day 4 Navratri 2025: నాలుగో రోజు కూష్మాండ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక! ఈరోజు పఠించాల్సిన శ్లోకం ఇదే!
Kushmanda Durga Alankaram : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నవదుర్గలుగా దర్శనమిచ్చే శ్రీశైల భ్రమరాంబిక నాలుగో రోజు కూష్మాండ అలంకారంలో దర్శనమిస్తోంది.

Srisailam Shardiya Navratri 2025: శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడ భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా దర్శనమిచ్చిన భ్రమరాంబిక సెప్టెంబర్ 25 నాలుగో రోజు కూష్మాండ దుర్గగా అభయం ఇస్తోంది.
"కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం
అంటే తనకున్న శక్తిలో ఈ విశ్వాన్ని సృష్టించిన తల్లి అని అర్థం. కూష్మాండ రూపంలో ఉన్న ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి తేజస్సే సూర్యభగవానుడు అనిచెబుతారు..అందుకు ప్రతీకగా సూర్యుడిని ధరించి కనిపిస్తుంది కూష్మాండ దుర్గ. అందుకే ఈ అలంకారాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
పులివాహనంపై కూర్చుని దర్శనమిచ్చే కూష్మాండ దుర్గ..ఎనిమిది చేతుల్లో విల్లు , బాణం, చక్రం, గద, కమలం, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది. ఈ అమ్మవారికి గుమ్మడికాయ బలి ప్రీతికరం.
కూష్మాండ రూపం ( Kushmanda Durga)
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
కుష్మాండా దుర్గ ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో జన్మించిన అమ్మవారికి మహాకాళి అని పేరు పెట్టింది. ఈ రూపం చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు, చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి కనిపిస్తుంది. మండుతున్న చితిపై కూర్చుని ఉండే ఈ అమ్మవారు. త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది.
కూష్మాండ దుర్గా మూడో కంటి నుంచి ఉద్భవించిన రూపం బంగారు వర్ణంలో 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారికి దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయిన తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టింది.
కూష్మాండ దేవి దృష్టి మహాకాళిపై పడగానే.. ఆమె నుంచి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పులి చర్మం, మెడ చుట్టూ ఒక పాము , తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీకి శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అయ్యారు.
కూష్మాండ దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలు, 4 చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. తనకి బ్రహ్మ అని పేరు పెట్టింది. ఆ స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కూష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.






















