అన్వేషించండి

Navratri 2024 : వైష్ణోదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. IRCTC నార్త్ ఇండియా టూర్​ ప్రత్యేక ప్యాకేజీ!

IRCTC Tour Package: నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా వైష్ణోదేవి ఆలయం సహా హరిద్వార్​ రిషికేశ్​ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది..

Navratri 2024 IRCTC Tour Package: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జమ్ముకశ్మీర్​ కాట్రాకు సమీపంలో ఉన్న వైష్ణోదేవి ఆలయం. వేదకాలంనాటిది అని భావించే ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండ‌ల మధ్య ఉంది.

పురాణాల ప్రకారం మహాభారత యుద్ధానికి ముందు  పాండవులను ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని..అందుకే విజయం సాధించారని చెబుతారు. స్థలపురాణం ప్రకారం పాండవులే మొదటగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఆ పక్కనే ఉన్న ఐదు రాతికట్టడాలను పాండవులకు ప్రతీకగా భావిస్తారు.

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ వైష్ణోదేవిని దర్శించుకోలేం అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం..అమ్మవారి దర్శనానికి ఎక్కువ దూరం గుహల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏటా 80 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. తిరుమల తిరుపతి ఆలయం తర్వాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునే ఆలయం వైష్ణోదేవి.. 

Also Read: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!

శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలానే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.

మాతా వైష్ణో దేవి మందిరం బోర్డ్ కూడా అమ్మవారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు లైన్‌లో నిలబడకుండా మినహాయింపు ఉంటుంది. పుణ్యక్షేత్రం బోర్డు కత్రా రైల్వే స్టేషన్‌లో స్వీయ-నమోదు బూత్‌లు ఏర్పాటు చేసింది. 

మరోవైపు భారతీయ రైల్వే వైష్ణోదేవి యాత్ర సహా నార్త్ ఇండియా టూర్ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది.  ఇండియన్​ ర్వైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​.. ఈ ప్యాకేజీలో భాగంగా ఉత్తర భారత దేశంలో  పలు ఆలయాలను, పర్యాటక  ప్రదేశాలను సందర్శించవచ్చు.  

మాత వైష్ణో దేవీ విత్​ హరిద్వార్​ రిషికేశ్​ యాత్ర పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది...ఇది మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, మథుర, శ్రీ మాత వైష్ణో దేవి, హరిద్వార్​, రిషికేశ్​ ప్రదేశాలు సందర్శించవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్ మొదలవుతుంది..గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్​, బోనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్​ కాగజ్​నగర్​, బల్హర్షా, వార్ధా, నాగ్​పూర్​ మీదుగా మూడో రోజు ఉదయం ఆగ్రా చేరుకుంటారు. నాలుగో రోజు మధుర, ఐదో రోజు వైష్ణోదేవి ఆలయం, ఆరో రోజు  కత్రా రైల్వే స్టేషన్​ నుంచి హరిద్వార్​, ఏడో రోజు మానసాదేవి ఆలయం, ఎనిమిదో రోజు గంగాహారతి ...ఆ తర్వాత రోడ్డు మార్గంలో రిషికేశ్ రైల్వేస్టేషన్ కి చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు...విజయవాడకు రాత్రి 11.45 కి చేరుకుంటారు.  

పెద్దలకు రూ.17,940 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు  రూ.16,820
3AC అయిచే పెద్దలకు రూ.29,380 - పిల్లలకు రూ.28,070
2AC అయితే పెద్దలకు రూ.38,770 -  చిన్నారులకు రూ.37,200 

ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్లతో పాటూ...హోటల్​ అకామిడేషన్​, లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ , ట్రావెల్​ ఇన్సూరెన్స్​, టీ - బ్రేక ఫాస్ట-లంచ్-డిన్నర్ ఉంటాయి.

Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget