అన్వేషించండి

Mayasabha : మయసభ కాదు మాయాసభ, వైజ్ఞానిక అద్భుతం, నిర్మాణానికి ఎన్నాళ్లు పట్టిందో తెలుసా?

Mayasabha in Mahabharata: మయసభ.. ఇది మయసభ కాదు మాయాసభ. అంటే ఉన్నదిలేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించే వైజ్ఞానిక అద్భుతం. పాండవులపై కృతజ్ఞతగా మయుడు నిర్మించి ఇచ్చిన ఈ భవనం గురించి తెలుసా?

Mayasabha : అగ్నిదేవుడు తన ఆకలి తీర్చుకునేందుకు కాండవ వనాన్ని దహనం చేస్తాడు. ఆ సమయంలో మంటల్లో చిక్కుకున్న దానవ శిల్పి మయుడిని పాండవులు రక్షిస్తారు. ఇందుకు ప్రతిగా ఏం కావాలో చెప్పమని అడిగాడు మయుడు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు స్పందిస్తూ ధర్మరాజు వైభవానికి తగినట్లు ఓ భవనం నిర్మించి ఇవ్వమని అన్నాడు. ఈ భూమిపై ధర్మజుడికి సమానమైన రాజు లేడు..అందుకు తగ్గట్టుగా భవనాన్ని నిర్మిస్తానని మాటిచ్చాడు. 

వృషపర్వుడనే రాజుకోసం సభ నిర్మించి ఇచ్చేందుకు అన్ని ఉపకరణాలు సమకూర్చుకున్నాను కానీ అది కార్యరూపం దాల్చలేదని చెప్పిన మయుడు...ఆ ఉపకరణాలు తీసుకొచ్చి అద్భుతమైన భవనం నిర్మిస్తానని చెప్పాడు. నీటికి బదులుగా ఇంద్రనీల మణులు, నీటిలో పద్మాలకోసం పద్మరాగ మణులు, రజతంతో తెల్లని తామరలు రాజహంసలు, వజ్రాలతో చేపలు, ముత్యాలతో నురగ, మరకతమణులతో నాచుని రూపొందించాడు. వీటితో పాటూ చెట్లు, పక్షులు, పక్షిగూళ్లు సహా భవనం మొత్తం రత్నకాంతులతో వెలిగిపోయేలా తీర్చిదిద్దాడు. దీని నిర్మాణానికి పట్టిన సమయం 14 నెలలు. ఇదే దుర్యోధనుడి అసూయకు కారణమైంది. 

మయుడు నిర్మించిన భవనంలోకి ప్రవేశించేందుకు ఓ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాజసూయయాగం (Rajasuya Yagya ) తలపెట్టాడు ధర్మరాజు. ఇందులో భాగంగా వివిధ దేశాధినేతలను, సామంతరాజులను ఆహ్వానించాడు. ఈ సభన చూసి భ్రాంతిని కలిగించే ప్రదేశంలో భ్రమపడి అవమానపడ్డాడు దుర్యోధనుడు. ఇదే పాండవులపై వైరాన్ని మరింత పెంచింది.  

ఈ నగరానికి ఇంద్రప్రస్థం (Indraprastha)  అనే పేరు..ఎందుకంటే ఇంద్రుడి స్వర్గంతో సమానంగా ఉండే నిర్మాణం కావడంతో ఇంద్రప్రస్థం అనే పేరు పెట్టారు. ధర్మరాజు ఇంద్రప్రస్థం నుంచి ధర్మంగా పరిపాలన సాగించాడు. ఈ నగరం సంపద, సంస్కృతి, శక్తికి చిహ్నంగా నిలిచింది. ఇంద్రప్రస్థం పాండవుల గొప్పతనాన్ని శ్రీకృష్ణుడితో వారి బంధాన్ని సూచిస్తుంది. ఈ ఇంద్రప్రస్థం ఢిల్లీలో పురానా ఖిలా సమీప ప్రాంతంతో సంబంధం కలగి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తారు..కానీ వీటికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు.

మానవ జీవితంలో భ్రమకి-వాస్తవానికి మధ్య నడిచే మార్గానికి ప్రతీక మయసభ. తృప్తికి, భద్రతకు, గౌరవానికి హామీ ఉండదు..అహంకారానికి, అసూయకు చోటిస్తే ప్రజ్ఞనాశనం అవుతుందనే గొప్ప సందేశం ఈ మయసభ.

మయసభ అనేది కేవలం శిల్పకళా సౌందర్యం మాత్రమే కాదు వైజ్ఞానిక అద్భుతం. కాంతిపరావర్తనం, అద్దంలో ప్రతిబింబం కనిపించడం, అదే బింబం ఇంద్రధనస్సులా వికృతి పొందడం , ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు..ఇలాంటి వైజ్ఞానికి అద్భుతాల నిలయం మయసభ.
 
మానవమేధస్సుకి అందని వైజ్ఞానిక అద్భుతాలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయ్. సాంకేతికత, లైవ్ టెలికాస్ట్, టెస్ట్‌ట్యూబ్ బేబీ, సరోగసీ, అణ్వాయుధాలు సహా భారతదేశంలో లేనిది ఏదీ లేదంటూ వేదవ్యాసుడు మహాభారతంలో ప్రస్తావించారు. ఇక దక్షిణ అమెరికా పెరులో  మయాన్ నాగరికత మూలపురుషుడు మయుడు. 

మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు...ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vastu Tips for Puja Room: ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
Car Number Plate Astrology: మీ కారు/బైక్ నంబర్ ప్లేట్ లో మీ అదృష్టం! సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోండి!
మీ కారు/బైక్ నంబర్ ప్లేట్ లో మీ అదృష్టం! సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోండి!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget