అన్వేషించండి

Geetha Jayanthi Wishes 2024: మనిషినిగా ఎలా జీవించాలో నేర్పించే మార్గదర్శి భగవద్గీత పుట్టిన రోజు - ఈ రోజు ఏం చేయాలి!

Geetha Jayanthi Significance 2024: డిసెంబరు 11 బుధవారం గీతాజయంతి. అంటే శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత పుట్టినరోజు.  ఈ రోజు ఏం చేయాలి?

Geetha Jayanthi 2024:  భగవద్గీత ఆవిర్భవించిన  మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. గీతాజయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు.. పఠించడం, మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం..శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించింది ఇదే..

Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
 
అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రమే భగవద్గీత. ఈ పవిత్రగ్రంధం ఉద్భవించిన రోజైన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా జరుపుకుంటారు.  

సాధారణంగా భగవద్గీత ఎక్కడైనా వినిపించగానే..అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారేమో అనే చర్చ జరుగుతుంటుంది. అంటే శవం దగ్గర వినే గ్రంధంగా భగవద్గీతను మార్చేశారు కొందరు.

భగవద్గీత ఎవరైనా వింటేచాలు..ఎందుకంత వైరాగ్యం అంటారు ఇంకొందరు. అంటే జీవితంపై విరక్తి వస్తే భగవద్గీత చదువుతారా?

వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యమో, అపశకునమో కాదు...ఆచరించాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణ సూచించే అద్భుతమైన జీవన సారం. 

భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో సమయం గడవడం కోసం చదివే గ్రంధం కాదు..ఎన్నో ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువతకు దిక్సూచి. వివిధ రకాల వికారాల నుంచి ఎలా బయటపడాలో సూచించే మార్గదర్శి. 

Also Read:  పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

పుట్టుక నుంచి మరణం వరకూ జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత. భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న ఉండదు. 

కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం ద్రవించి...కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞాన బోధ భగవద్గీత.  

మహాభారతంలో  భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి  42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని  అంటారు. 

మహా భారతంలో భగవద్గీత ఓ భాగమైననప్పటికీ దీనికి  ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో పురాణేతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు ..జీవితానికి అర్థం, పరమార్థం అర్థమవుతుంది.  

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది. 
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’
క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం.  భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు కృష్ణ పరమాత్ముడు.

Also Read: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే
 
గీతలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి, వాటిని ఎలా సంధించాలో చెప్పలేదు...యుద్ధ వ్యూహాలు అసలే నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నింటిలో మేటి అయిన అర్జునుడిని కమ్మేసిన మాయను తొలగించి కురుక్షేత్ర సంగ్రామంలోకి  దిగేలా బోధించాడు. 

అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం ... విజయం సాధిస్తే  రాజ్యలక్ష్మి  వరిస్తుంది. ఏం జరిగినా ప్రయోజనమే..కృతనిశ్చయంతో యుద్ధానికి సన్నద్ధమవు అని బోధించాడు కృష్ణుడు. 

చెప్పడం వరకే శ్రీ కృష్ణుడి పని..అది శ్రద్ధగా విని ఆచరించి కర్తవ్యాన్ని నిర్వర్తించి విజయలక్ష్మికి స్వాగతం పలికాడు అర్జునుడు.. అందుకే ఈ రోజు భగవద్గీతను పూజించడం కాదు...పఠించి ...అనుసరించండి...

ఏబీపీ దేశం ప్రేక్షకులు అందరకీ గీతాజయంతి శుభాకాంక్షలు (Happy Geetha Jayanthi Wishes 2024)

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget