అన్వేషించండి

Happy Father's Day 2024: రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు..వీరి ప్రతి అడుగు నాన్నకు ప్రేమతో!

Spirituality: తండ్రి ఆదేశాన్ని ప్రశ్నించకుండా పాటించిన కొడుకు .. తండ్రి ఆనందం కోసం సింహాసనానికి దూరమైన సుపుత్రుడు... నాన్న చెప్పారని అమ్మ తల తీసేసిన తనయుడు.. నాన్నకు ప్రేమతో అంటే ఇదే కదా...

Happy Father's Day 2024: తొలి అడుగు తన గుండెలపై వేయించుకుని తన ఊపిరిపోయేవరకూ ప్రతి అడుగులోనూ వెన్నంటే ఉండి నడిపించే నాన్న గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..ఈ జనరేషన్ అయితే లవ్ యూ నాన్న అని సంతోషంగా చెప్పేస్తున్నారు.. మరికొందరు బహుమతులు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అయితే పురాణపురుషులు మాత్రం తమ ప్రేమను మాటల్లో చెప్పలేదు..చేతల్లో చూపించారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నప్పటికీ..ముఖ్యంగా నలుగురి గురించి చెప్పుకోవాలి...వాళ్లే రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు...

దశరథుడు - శ్రీ రాముడు

అయోధ్యకు రాజైన దశరధుడి ముగ్గురి భార్యల్లో కౌశస్య తనయుడు శ్రీరాముడు. నలుగురు సోదరులలో పెద్దవాడైన రాముడు... దశరథుడి తర్వాత సింహాసాన్ని అధిష్టించాలి, పాలనా బాధ్యతలు స్వీకరించాలి. పెళ్లి జరిగింది, తెల్లారితే పట్టాభిషేకం జరుగుతుందన్న సమయంలో.. కైకేయి కోరిన వరాల కారణంగా రాముడు అడవులబాటపట్టాల్సి వచ్చింది. ఓ యుద్ధం సమయంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా దశరథుడు ఇచ్చిన వరాలను కైకేయి...రాముడి పట్టాభిషేకం జరిగేముందు వినియోగించుకుంది. తనని చూడకుండా తండ్రి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడని తెలిసినా, తండ్రి మానసిక క్షోభను అర్థం చేసుకున్నా.. ఒక్కమాటకూడా మాట్లాడకుండా అడవుల బాటపట్టాడు.  పితృవాక్య పరిపాలకుడిగా తండ్రిపై ప్రేమను ఇలా చాటుకున్నాడు రాముడు..

Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!
 
శంతనుడు - భీష్ముడు

హస్తినాపురానికి రాజైన శంతనుడు..ఓ సమయంలో నది ఒడ్డున గంగాదేవిని చూసి వివాహం చేసుకోమని అడుగుతాడు. అయితే గంగాదేవి తనని ప్రశ్నించకూడదు అనే షరతు విధించి వివాహానికి అంగీరిస్తుంది. కానీ పుట్టిన సంతానాన్ని నీటిలో విసిరేస్తున్న గంగాదేవిని ఓ రోజు ప్రశ్నిస్తాడు శంతనుడు. వెంటనే తన చేతిలో ఉన్న బిడ్డను శంతనుడికి అప్పగించి వెళ్లిపోతుంది గంగాదేవి. తనే భీష్ముడు. ఆ తర్వాత కొంతకాలానికి వేటకు వెళ్లిన శంతనుడు సత్యవతి అనే జాలరి కన్యను చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తమ కుమార్తెకు పుట్టినవారే రాజ్యానికి రాజు కావాలని సత్యవతి తల్లిదండ్రులు షరతు విధించడంతో శంతనుడు ససేమిరా అని వచ్చేస్తాడు. కానీ తండ్రి ఆనందం కోసం భీష్ముడు రాజ్యాన్ని త్యాగం చేస్తున్నానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. 

జమదగ్ని- పరశురాముడు 

శ్రీ మహావిష్ణువు ఆవేశ అవతారంగా చెప్పే పరశురాముడు..జమదగ్ని, రేణుకకు జన్మించాడు. ఓరోజు జమదగ్ని మహర్షి..భార్యను గంగాజలం తీసుకురమ్మని పంపించాడు. అదే సమయానికి నది దగ్గర  చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలతో కలసి ఆడుతున్న జలక్రీడలను చూస్తుండిపోయింది రేణు.కాసేపటికి తేరుకుని గబగబా ఇంటికి చేరుకుంది. కానీ అప్పటికే పూజాసమయం మించిపోవడంతో  ఏం జరిగిందా అని తన తపోశక్తితో తెలుసుకున్నాడు జమదగ్ని. వెంటనే తన సంతానాన్ని పిలిచి..ఆమె తల తీసేయమని ఆజ్ఞాపించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోయినా తండ్రిమాటను పాటిస్తూ చెప్పిన పని చేసన పరశురాముడు..తండ్రి ఏం కావాలో కోరుకోమనగానే తల్లిని బతికించమని ప్రార్థించాడు. అలా తండ్రి మాట జవదాటకుండానే తిరిగి తల్లిని బతికించుకున్నాడు.  

Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!

శ్రవణకుమారుడు

రామాయణ కాలానికి చెందిన వృద్ధ దంపతులకు జన్మించినవాడే శ్రవణకుమారుడు. వయసు మళ్లిన తల్లిదండ్రులను పోషించేందుకు చిన్నప్పటి నుంచీ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు శ్రవణకుమారుడు. కాశీకివెళ్లి గంగలో స్నానమాచరించాలన్న వారి కోరికమేరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వయసుపైబడి చూపుమందగించిన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపై మోసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గ మధ్యలో తల్లిదండ్రుల దాహం తీర్చేందుకు ఓ కొలను వద్దకు వెళ్లిన సమయంలో..నీటి సవ్వడి విని జంతువు అనుకుని చూసుకోకుండా బాణం వేసేసాడు దశరథుడు. ఆ తర్వాత శ్రవణకుమారుడి అరుపు విని అక్కడకు వెళ్లిన దశరథుడు పశ్చాత్తాపపడ్డాడు. ఆ పాప ఫలితమే దశరథుడికి కూడా చివరిక్షణాల్లో రాముడు దూరంకావడం.

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget