అన్వేషించండి

Vijayawada News: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - దుర్గమ్మకు రూ.18 లక్షలు విలువైన మంగళసూత్రం, ఎవరిచ్చారంటే?

Andhra News: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఓ భక్తుడు రూ.18 లక్షల విలువైన మంగళ సూత్రం దుర్గమ్మకు బహూకరించారు.

Navaratri Utsavams In Indrakeeladri In Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి (Annapurnadevi) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా అమ్మవారి మూల విగ్రహానికి భక్తులు సమర్పించిన వజ్రాల కిరీటం, సూర్యచంద్రాలను అలంకరించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తున్నారు.

ప్రకాశం జిల్లా (Prakasam District) కొండెపి నివాసి అయిన కల్లగుంట అంకులయ్య అనే వ్యక్తి రూ.18 లక్షలు విలువైన బంగారు మంగళసూత్రాన్ని దుర్గమ్మకు బహూకరించారు. దీన్ని ఆలయ ఈవో రామారావుకు అందించారు. అలాగే, గుంటూరుకు చెందిన మరో భక్తుడు సుమారు ఆరున్నర కేజీలకు పైగా వెండితో చేసిన హంస వాహనాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కానుకలు అందించిన భక్తులకు అభినందనలు తెలియజేశారు. దాతలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దాతలకు దర్శనం అనంతరం శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా, ఈ నెల 12వ తేదీ వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

భక్తులకు కీలక సూచనలు

ఉత్సవాల్లో భాగంగా గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆదివారం నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. కాగా, తొలిరోజు అమ్మవారిని 49 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 'రెండో రోజు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ 36 వేల మంది దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం రోజును భారీగా భక్తులు తరలివస్తారు. 2 రోజుల్లో 28 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 3,952 మంది తలనీలాలు సమర్పించారు. 1,39,906 లడ్డూలు కొనుగోలు చేశారు. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నాం. 6 లడ్డూలు కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

'అదే లక్ష్యం'

అటు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలనేదే తమ లక్ష్యమని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 'వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనం చేసుకోవాలి. రూ.500 దర్శనం ఆలస్యమవుతోంది. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం. పోలీస్ యూనిఫాంలో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నాం. మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్టం ఏర్పాట్లు చేస్తున్నాం. మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం.' అని సీపీ వివరించారు.

Also Read: Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget