అన్వేషించండి

Vijayawada News: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - దుర్గమ్మకు రూ.18 లక్షలు విలువైన మంగళసూత్రం, ఎవరిచ్చారంటే?

Andhra News: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఓ భక్తుడు రూ.18 లక్షల విలువైన మంగళ సూత్రం దుర్గమ్మకు బహూకరించారు.

Navaratri Utsavams In Indrakeeladri In Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి (Annapurnadevi) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా అమ్మవారి మూల విగ్రహానికి భక్తులు సమర్పించిన వజ్రాల కిరీటం, సూర్యచంద్రాలను అలంకరించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తున్నారు.

ప్రకాశం జిల్లా (Prakasam District) కొండెపి నివాసి అయిన కల్లగుంట అంకులయ్య అనే వ్యక్తి రూ.18 లక్షలు విలువైన బంగారు మంగళసూత్రాన్ని దుర్గమ్మకు బహూకరించారు. దీన్ని ఆలయ ఈవో రామారావుకు అందించారు. అలాగే, గుంటూరుకు చెందిన మరో భక్తుడు సుమారు ఆరున్నర కేజీలకు పైగా వెండితో చేసిన హంస వాహనాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కానుకలు అందించిన భక్తులకు అభినందనలు తెలియజేశారు. దాతలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దాతలకు దర్శనం అనంతరం శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా, ఈ నెల 12వ తేదీ వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

భక్తులకు కీలక సూచనలు

ఉత్సవాల్లో భాగంగా గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆదివారం నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. కాగా, తొలిరోజు అమ్మవారిని 49 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 'రెండో రోజు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ 36 వేల మంది దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం రోజును భారీగా భక్తులు తరలివస్తారు. 2 రోజుల్లో 28 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 3,952 మంది తలనీలాలు సమర్పించారు. 1,39,906 లడ్డూలు కొనుగోలు చేశారు. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నాం. 6 లడ్డూలు కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

'అదే లక్ష్యం'

అటు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలనేదే తమ లక్ష్యమని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 'వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనం చేసుకోవాలి. రూ.500 దర్శనం ఆలస్యమవుతోంది. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం. పోలీస్ యూనిఫాంలో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నాం. మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్టం ఏర్పాట్లు చేస్తున్నాం. మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం.' అని సీపీ వివరించారు.

Also Read: Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?
ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి దోహదపడే చాతుర్మాసం! నవంబర్ వరకూ ఈ 4 రాశులవారికి విష్ణువు అనుగ్రహం, సంపద!
ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి దోహదపడే చాతుర్మాసం! నవంబర్ వరకూ ఈ 4 రాశులవారికి విష్ణువు అనుగ్రహం, సంపద!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget