అన్వేషించండి

Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాశీ విశాలక్షి శక్తిపీఠం. అమ్మ కొలువైన అత్యంత పుణ్యప్రదేశం వారణాసి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే...

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని  చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా  పేరుపొందింది.కాశీ విశ్వనాథుడి ఆలయానికి కొంత దూరంలోనే విశాలాక్షి అమ్మ కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి  గర్భగుడిలో రెండు రూపాల్లో దర్శనమిస్తుంటుంది. ఓ రూపం స్వయంభువు, మరో రూపం అర్చామూర్తి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా అర్చామూర్తిని దర్శించుకుని ఆ తర్వాత స్వయంభుని దర్శించుకోవాలి. ఇక్కడ కొలువైన విశాలాక్షి అమ్మవారి గుడి చాలా చిన్నది. బంగారు తొడుగుతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో దక్షిణాది సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. శక్తి ఆగమ శాస్త్రంలో తమిళ బాహ్మణులు పూజలు నిర్వహిస్తారు. ఆదిశంకరాచార్యాలు శ్రీ చక్రం ప్రతిష్టించినప్పటి నుంచి అక్కడ దక్షిణాది సంప్రదాయాలు పాటించడం ప్రారంభించారు. ఆలయంలో నలుగురు శిష్యులతో ఉన్న శంకరాచార్యుల ఫొటో కనిపిస్తుంది.  అమ్మవారి గుడి చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉంటాయి. అమ్మవారి ఎదురుగా ఉన్న  శ్రీ చక్రం భక్తులు తాకి నమస్కరించుకోవచ్చు. 

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

శక్తి పీఠం విశిష్టత
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడిన ప్రదేశంగా చెబుతారు. పురాణాలలో విశాలాక్షిని ఈ విశ్వాన్ని పరిపాలించే దేవతంగా వర్ణించారు. తాంత్రిక శాస్త్రంలో మహాకాళి రూపంగా చెబుతారు.  కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుందని..కాశీ విశ్వనాథుడు మహాకాళుడి రూపంలో మారి చనిపోయిన వారి చెవిలో తారకమంత్రం ఉపదేశించి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని చెబుతారు.

అన్నపూర్ణాదేవి
స్కాంద పురాణంలో ఉన్న ఓ కథ ప్రకారం వారణాసిలో వ్యాసభగవానునికి, ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఆగ్రహంతో వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాడట. అప్పుడు అన్నపూర్ణగా అవతరించిన విశాలాక్షి వ్యాసుడిని, తన శిష్యులను ఆహ్వానించి భోజనం వడ్డించింది.   అయితే కాశీపై ఆగ్రహం చూపిన వ్యాసుడిని పరమేశ్వరుడు కాశీ నుంచి బరిష్కరించడం..తప్పు క్షమించమని వ్యాసుడు వేడుకోవడంతో ... తిరిగి కాశీలోకి అనుమతిస్తానని శివుడు చెప్పాడు. అదుకే అన్నపూర్ణ, విశాలాక్షి ఒకరే అన్నది భక్తుల భావన. అయితే కాలక్రమంలో రెండు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాధుని గుడికి దగ్గరలో అన్న పూర్ణ ఆలయం ...దీనికి కొద్ది దూరం లో విశాలాక్షి ఆలయం ఉంది. వివాహం కాని అమ్మాయిలు ఇక్కడ గంగలో స్నానమాచరించి విశాలాక్షిని దర్శించుకుంటే అనుకూలుడైన భర్త లభిస్తాడని విశ్వాసం. ఈ సమీపంలో ఉన్న మణి కర్ణికా ఘాట్ లో వేలమంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. 

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

స్వర్గాన్ని మించిన కాశీ
కాశివిశాలక్షి అమ్మవారి ఆలయం చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. కాశీలో ఏడు ఆవరణలలో 56 గణపతులున్నారు. అందులో డుంఢిరాజగణపతి ప్రసిద్ది. మార్కండేయ మాధవ్ ఆలయం, భరతమాత మందిర్,  కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, దుర్గగుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్, తిలభణ్డేశ్వర్ ఆలయం సహా ఇక్కడ దర్శించుకోవాల్సి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాశీ ముందు స్వర్గం సరితూగదన్నాడు శ్రీనాథుడు. పరమేశ్వరుడికి మొగటి నగరం కాబట్టి...కాశీకి అంత విశిష్టత. ప్రళయం వచ్చి సమస్త విశ్వం నీటమునిగినప్పుడు కూడా కాశీ నగరం మిగిలిపోతుందని చెబుతోంది స్కంద పురాణం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget