అన్వేషించండి

ముస్లిం మైనార్టీ వర్గాలను మరింత ఆకట్టుకునేలా వైసీపీ భారీ ప్లాన్

ముస్లిం వర్గాలతో నియోజకవర్గాల వారీగా అవసరమైతే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్లాన్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం వర్గాలను మరింత దగ్గర చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ముస్లిం వర్గాలతో నియోజకవర్గాల వారీగా అవసరమైతే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కీలక నేతలతో అధినాయకత్వం మంతనాలు జరుపుతున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 

కీలకంగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలతో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా గతంలో రాజకీయపార్టీలు ఉపయోగించుకునేవని సజ్జల కామెంట్‌ చేశారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు వైఎస్‌ జగన్ ముస్లిం మైనారిటీల్లో వెనకబాటుతనాన్ని రూపుమాపాలనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి కుటుంబాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. వైఎస్ జగన్ ముస్లిం మైనారిటీలను శాసన సభ్యులుగా ,శాసన మండలి సభ్యులుగా నామినేటెడ్ పదవుల్లో, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 

ప్రస్తుతం అమలు జరుగుతున్న అమ్మఒడితోపాటు షాదితోఫా, విదేశీ విద్య వంటి అనేక పథకాలు ముస్లింలలో పేదరికాన్ని పొగొట్టేవిధంగా ఉన్నాయనడంలో సందేహం లేదన్నారు సజ్జల. ఆ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీలు తమ వర్గంలో చైతన్యం తీసుకువచ్చే విధంగా పని చేయాలని సూచించారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అనటంలో అతిశయోక్త కాదన్నారు. ముస్లిం మైనారిటీల సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలియ చేయాలని సూచించారు.

త్వరలో మరో భారీ కార్యక్రమం...
ఇప్పటికే జగన్ ప్రభుత్వం మా నమ్మకం జగన్ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇక మైనార్టీ వర్గాలను దగ్గకు తీసుకునేందుకు మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే విజయవాడ లేదా కడప కేంద్రంగా మైనార్టీ వర్గాల సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గాలతో పార్టీ పరంగా సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల నాటికి అన్ని వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

డిప్యూటీ సీఎంని చేసింది వైసీపీనే
మైనార్టిలను డిప్యూటీ సీఎంగా చేసి బాధ్యతలు అప్పగించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మైనార్టీలతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ర్టంలో ముస్లిం మైనారిటీలు వైఎస్సార్‌సీపీకి, రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని నిశ్చయించుకోవడం శుభపరిణామం అన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీల భద్రతకు, సంక్షేమానికి, వారి ఉన్నతికి అనేక నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తున్న ఘనత జగన్‌దేనని అంజాద్‌ బాషా అన్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీ కుటుంబాలలో ఏ విధంగా వెలుగులు నింపాయో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని రంగాల్లో అభివృద్దికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. ముస్లింలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ ఇటీవల కాలంలో టిడిపి నేతలు, చంద్రబాబు, లోకేష్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ముస్లింలందరూ తిప్పికొట్టాలన్నారు. 

చంద్రబాబు హయాంలో ముస్లింలపై చేసిన అరాచకాలు తమను గాయపరిచాయన్నారు అంజాద్‌ బాషా. వాటిని ముస్లింల ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ముస్లిం జనాభా నివసిస్తున్న ప్రాంతాలలో జగన్ చేసిన మేలును, చంద్రబాబు చేసిన అరాచకాలపై చైతన్యం తేవాలన్నారు. జిల్లా స్థాయిలలో ముస్లిం మైనారిటీలతో సదస్సులను నిర్వహించి వారిలో చైతన్యం తెస్తామని వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Advertisement

వీడియోలు

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
Embed widget