అన్వేషించండి

BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ?

కేంద్ర ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విమర్శల వాడి పెంచుతోంది. బీజేపీతో వ్యూహాత్మకంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తోందా ?


BJP Vs YSRCP :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో  తాము దగ్గర అంటే తాము దగ్గర అని నిరూపించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచుతోంది. పొత్తులో ఉన్న జనసేన పార్టీ అసలు స్పందించడం లేదు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నా .. వారి ఆరోపణల కోణం కేంద్రంపై కాకుండా వైఎస్ఆర్‌సీపీపైనే ఉంటోంది. ఏపీ అధికార పార్టీ కేంద్రానికి లొంగిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విమర్శల జోరు పెంచింది. 

మోదీతో యుద్ధం చేస్తున్నానని ప్రకటించుకున్న జగన్ !

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఎప్పుడూ మోదీతో పోరాటం అనే మాట రానివ్వలేదు. ప్రత్యేకహోదాను కూడా .. " ప్లీజ్.ప్లీజ్ " అని అడుగుతామనే చెప్పారు. ఆ పద్దతి ప్రకారమే వెళ్తున్నారు. పోలవరం నిధులు..ఏపీ రాజధాని సహా విభజన చట్టంలోని అంశాలు ఏదైనా సరే.. ఎప్పుడైనా కలిసినప్పుడు వినతి పత్రం ఇచ్చామన్న మాటే తప్ప.. అటు పార్లమెంట్‌లో కానీ ఇటు నేరుగా కానీ డిమాండింగ్‌గా అడిగిన సందర్భాలు లేవు . అంత సామరస్యంగా కేంద్రంతో సంబంధాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఎప్పుడూ వినిపించలేదు. మూడేళ్లపాటు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఇదే సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. సీఎం జగన్ ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను ప్రధాని మోదీతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకున్నాడు. కేంద్రమే పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. మోదీని జనం తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని కూడా చెప్పుకొచ్చారు. ఇక పలుమార్లు కొడాలి నాని వంటి మంత్రులు మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఇప్పుడు నేరుగా  పార్లమెంట్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని వాదించారు. సెస్‌లు.. ఇతర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని వాదించారు. చివరికి కేంద్రం కంటే ఏపీలో పరిపాలన బాగుందని విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే గొప్పగా ప్రకటించారు. 

రాష్ట్రాల విషయంలో కేంద్రం వైఖరి వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది ?

మూడేళ్లుగా కేంద్రం ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడూ అంతే వ్యవహరిస్తోంది. పెద్దాగ తేడా లేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ రాజకీయంగా స్పందిస్తున్న విధానంలోనే తేడా కనిపిస్తోంది. అప్పట్లో కేంద్రం రాష్ట్రాలకు చెందిన అధికారాలను తమ పరం చేసుకోవడానికి ఏవైనా చట్టాలు పెట్టినా.. వివాదాస్పద అంశాలపై బిల్లులు తెచ్చినా వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా ఆమోదం తెలిపేది. పార్టీలో చర్చించడాలు కూడా ఉండవు. ఎన్నార్సీ, సీఏఏ, వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై బిల్లులు పెట్టినా... ఆమోదం తెలిపారు. పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ .. ఆయా అంశాలపై పోరాడాలని లేఖలు రాసినా ఏపీ సీఎం వైపు నుంచి స్పందన లేదు. చివరికి సివిల్ సర్వీస్ అధికారుల్ని రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసుకు తీసుకోవచ్చన్న  ఉత్తర్వులు తెస్తామన్నా.. జగన్ అంగీకరించారు. కానీ ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇంతలా విధేయంగా వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంలోని లోపాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 


కేంద్రం సహకరించడం లేదనే ఆగ్రహమా ? 

రాష్ట్ర ప్రయోజనాల సంగతేమో కానీ .. వైఎస్ఆర్‌సీపీ ఇస్తున్న సహకారం మేరకు కేంద్రం నుంచి ఆ పార్టీకి సహకారం లభించింది. రాజకీయ పరమైన నిర్ణయాలు బీజేపీ వ్యతిరేకించలేదు. మూడు రాజధానులు లాంటి వాటిని .. రాష్ట్రాల పరిధిలోని అంశం అని చెప్పి .. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇక అప్పుల విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటోంది రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని బహిరంగంగా కనిపిస్తున్నా.. వీలైనంతగా మౌనం పాటిస్తోంది. కాగ్‌కు పూర్తి స్థాయి లెక్కలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే శ్రీలంక  దివాలా తీసిన తర్వాత రాష్ట్రాల అప్పుల విషయంలో కేంద్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏపీ అప్పుల విషయంలోనూ కాస్త గట్టిగా ఉంటోందని.. నిబంధనలకు విరుద్ధంగా రుణాలివ్వొద్దని బ్యాంకులుక లేఖలు రాస్తోందని వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. అందుకే తమ ఆగ్రహాన్ని ఇలా వెల్లడిస్తోందని అంటున్నారు. 

రాజకీయ కారణాలా ?

అయితే బీజేపీ విషయంలో వైఎస్ఆర్‌సీపీ వైఖరి మారడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో పొత్తుల చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా చంద్రబాబు విషంయలో గతంలో చూపించని సాఫ్ట్ నెస్ చూపిస్తోంది. చివరి క్షణంలో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించినప్పటికీ.. వారితో భేటీ అయ్యారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి కూడా పిలుపు వచ్చింది. పలువురు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయం మారకూడదన్న ఉద్దేశంతో  బీజేపీపై ఒత్తిడి పెంచడానికి వైఎస్ఆర్‌సీపీ ..  బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా ఏపీ రాజకీయాల్లో మార్పు మాత్రం కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget