అన్వేషించండి

జనవరి 25న వైసీపీ ఎన్నికల శంఖారావం- 100 సభల్లో పాల్గోనున్న జగన్

Jagan Election Campaign: వైఎస్‌ఆర్‌సీపీలో 59 మంది ఇన్‌ఛార్జులను నియమిస్తూ మూడు జాబితాలను విడుదల చేశారు. ఇప్పుడు నాల్గో జాబితాపై కసరత్తు చేస్తోంది.

YSRCP Plans For Andhra Pradesh Assembly Elections 2024: నోటిఫికేషన్(General Election Notification 2024) రాక ముందు నుంచే ప్రజల్లో వైసీపీ(YSR Congress) వాదం బలంగా వ్యాప్తి చేయాలని జగన్(Jagan) ప్లాన్ చేస్తున్నారు. అందులో బాగంగా 25న భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేస్తూ ఇన్‌ఛార్జులను నియమిస్తున్నారు. ఆఖరి నిమిషంలో ఒకట్రెండు తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని వైసీపీ లీడర్లు చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఎలాంటి అసంతృప్తి లేకుండా సాఫీగా ఎన్నికలకు వెళ్లేందుకు ముందే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

నాల్గో జాబితాపై కసరత్తు 

వైఎస్‌ఆర్‌సీపీలో 59 మంది ఇన్‌ఛార్జులను నియమిస్తూ మూడు జాబితాలను విడుదల చేశారు. ఇప్పుడు నాల్గో జాబితాపై కసరత్తు చేస్తోంది. జగన్ జిల్లా పర్యటనకు వెళ్లే నాటికి దాదాపు అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల నియామకాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి వారంతా ప్రజల్లో ఉండాలని వైసీపీ నినాదమే జనంలో ఉండేలా చూస్తున్నారు. 

ప్రత్యర్థుల పొత్తులు కలిసి వస్తాయని నమ్మకం

పొత్తులతో ప్రతిపక్షాలు ఇంకా చర్చల దశలో ఉన్నారు. ఇంకా అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు చేయలేదు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఖరారు చేసుకొని అభ్యర్థులను ప్రకటించే నాటికి అసంతృప్త రాగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వైసీపీ అనుకుంటోంది. ఆ వివాదాలను చల్లార్చే పనిలో ప్రతిపక్షాలు బిజీ అవుతాయని అది తమకు బాగా కలిసి వస్తుందని అంటున్నారు. దాన్ని ప్రజలకు చూపించి న్యూట్రల్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది. 

ఎన్నికల వరకు ప్రజల్లోనే 

ఓవైపు షర్మిల కూడా దూసుకొస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగ ముందేఅభ్యర్థులు ఖరారు చేయడంతోపాటు, ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ ప్లాన్. ప్రతి ఇంటికి సంక్షేమం అందించామని దాన్నే జోరుగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇంటింటికీ నేతలు వెళ్లి గతానికి ఇప్పటికి తేడాను వివరించాలని చెబుతున్నారు. వైనాట్‌ 175 నినాదాన్ని బలంగా వినించాలని చూస్తున్నారు. 
పార్టీ నేతలంతా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగే టైంలోనే అధ్యక్షుడు జగన్ కూడా జిల్లాలు చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జనవరి 25న శంఖారావం

ఇందు కోసం జనవరి 25న భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అధికారిక కార్యక్రమాలు తగ్గించుకొని పూర్తిగా పార్టీపైనే ఫోకస్ పెట్టబోతున్నారు. ఓవైపు బహిరంగ సభల్లో పాల్గొంటూనే పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల నేతలతో ముచ్చటించనున్నారు. సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. 

వంద సభల్లో పాల్గొనేలా ప్లాన్

నోటిఫికేషన్ వెలువడే నాటికి రోజుకు రెండు సభల్లో పాల్గొనేలా వ్యూహాన్ని రచిస్తున్నారు జగన్. ప్రతిపక్షాలు తీసుకొచ్చే మేనిఫెస్టుకు దీటుగా తాము అమలు పరిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదే టైంలో మరో ఆకర్షణీయమైన ఎన్నికల హామీ పత్రం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి వంద సభల్లో పాల్గొని తమ విధానాలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యర్థులపై పైచెయి సాధించేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget