అన్వేషించండి

Three Capitals BJP Stand : మూడు రాజధానులు చేయాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి ! బీజేపీని కాదని జగన్ ముందుకెళ్లగలరా ?

బీజేపీ సహకారం లేకుండా వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులు చేయడం సాధ్యం కాదు. మరి బీజేపీ మద్దతు ఇస్తుందా ? కేంద్రం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది ?

 

Three Capitals BJP Stand :  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మూడు రాజధానులు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని సమస్య. ప్రభుత్వం చేయాలనుకుంటోంది.  విపక్షాలన్నీ వద్దంటున్నాయి. చట్టమూ సహకరించడం లేదు. కానీ " ప్రయత్నిస్తే అసాధ్యం కానిదేదీ లేదు" అనే టైపులో స్ఫూర్తి నింపుకుని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ మొత్తం వ్యహారం  ఎటు తేలాలన్నా బీజేపీ కీలకం. బీజేపీకి ఏపీలో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ఓకే అంటేనే మూడు రాజధానుల బండిని కాస్త ముందుకు కదపగలుగుతుంది. లేకపోతే లేదు. మరి కేంద్రంలోని బీజేపీ వైఖరేంటి ? అమరావతే అంటున్న ఏపీ బీజేపీ నేతల విధానానికే కట్టుబడతారా ? అదే జరిగితే జగన్ మూడు రాజధానుల్ని ఎప్పటికైనా చేయగలరా ? 

అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ !

ఏపీ నూతన రాజధానికి బీజేపీకి ప్రత్యేకమైన అనుబంధం ఉది. ఎందుకంటే  రాజధానిగా అమరావతిని ఖరారు చేసింది ఒక్క టీడీపీ ప్రభుత్వం కాదు. టీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. ప్రభుత్వంలో అప్పట్లో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. అమరావతికి సంబంధించిన ప్రతీ అంశం వారికి తెలుసు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. అందుకే భారతీయ జనతా పార్టీకి అమరావతి నిర్ణయంలో భాగం ఉంది. 

మూడు రాజధానులకు సహకరించారనే విమర్శలు !

తెలుగుదేశం పార్టీ అధికారలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి అన్నీ సాఫీగా సాగిపోయాయి.  బీజేపీ మద్దతు ఎంతో లభించింది.  పర్యావరణ అనుమతులు దగ్గర్నుంచి వివిధ రకాల ఆటంకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యాయి.  ప్రపంచ బ్యాంగ్ నిధుల కోసం మద్దతు లభించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నా బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. బీజేపీ తరపున ఏపీ వ్యవహారాలు చూసే జీవీఎల్ నరసింహారావు .. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని.. పదే పదే ప్రకటిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి నైతిక మద్దతు అందించారు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని.. అది గత ప్రభుత్వం.. ప్రస్తుత సీఎం జగన్ అంగీకారంతోనే అమరావతిగా నిర్ణయించిందని జీవీఎల్ పరిగణనలోకి తీసుకోలేదు. మార్చుకోవడం ఏపీ సర్కార్ ఇష్టమన్నారు. ఆయన మాటలకు తగ్గట్లుగా కేంద్రం కూడా పట్టించుకోలేదు. అంటే బీజేపీ హైకమాండ్.. కేంద్రం కూడా జగన్ ప్రయత్నాలను  అడ్డుకోలేదు. అలాగని ప్రోత్సహించలేదని అనుకోవచ్చు. కానీ న్యాయపోరాటం ద్వారా రైతులు తమ రాజధానిని చట్ట పరంగా కాపాడుకోగలిగారు. 

ఇప్పుడు బీజేపీ విధానంలో అనూహ్యమైన మార్పు !

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి విషయంలో కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వారిలోనూ మార్పు వచ్చింది. అమరావతికి భేషరతు మద్దతు పలికారు.  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గతంలో తాము వ్యవహరించిన విధానంపై విమర్శలు ఎదురైనా  ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. తమ విధానం అమరావతేనని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా అమరావతికే సానుకూలం అనే రీతిలో ప్రకటనలు రావడం ప్రారంభమైంది. కొత్తగా విడుదల చేసిన ఇండియామ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించారు. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని అని స్పష్టత వచ్చేలా విభజన సమస్యలపై చర్చల ఎజెండాలో చేర్చారు. జీవీఎల్ నరసింహారావు పూర్తిగా అమరావతే రాజధాని అని చెబుతున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులు కూడా అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తున్నారు.  అంటే జగన్ మూడేళ్ల కిందట మూడు రాజధానులన్నప్పుడు పరోక్షంగానైనా బీజేపీ సహకారం ఉంది కానీ ఇప్పుడు నేరుగా అమరావతికే మద్దతు ప్రకటించినట్లుగా స్పష్టమయింది. 

బీజేపీ మద్దతు లేకుండా మూడు రాజధానులు జగన్ చేయగలరా ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు లేకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయడం కానీ..  అసెంబ్లీలో పాస్ చేసుకోవడం కానీ..చట్టంగా మార్చడం గా కానీ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే మూడు రాజధానుల అంశం హైకోర్టులో తేలిపోయింది. మరోసారి బలం ఉందని బిల్లును ఆమోదించినట్లయితే..  అది కోర్టు ధిక్కరణ అవుతుంది. గవర్నర్ సంతకం చేయరు. పైగా రాజ్యాంగ ఉల్లంఘన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశంలో బీజేపీ మద్దతు ఉంటేనే ముందుకెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఎన్నికలక వరకూ టైం పాస్ చేసి.. ఎన్నికల్లో మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లే చాన్సులున్నాయి. అయితే ఎవరు గెలిచినా మూడు రాజధానల ఏర్పాటు మాత్రం సాధ్యం కాదు. కేంద్రం మద్దతు ఉంటే మాత్రం ముందడుగు పడే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
Mamata Banerjee TMC Rebellion 2026: లీడర్లు వెళ్లినా మమతా బెనర్జీకి తిరుగులేదు - ప్రత్యామ్నాయం లేకపోవడమే బలం - దీదీ కాకపోతే ఇంకెవరు?
లీడర్లు వెళ్లినా మమతా బెనర్జీకి తిరుగులేదు - ప్రత్యామ్నాయం లేకపోవడమే బలం - దీదీ కాకపోతే ఇంకెవరు?
Delimitation 2026 Southern States Loss: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
BRS Digital Membership Drive 2026: జోరందుకోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు - క్యాడర్ బలం ఎంత? నేతల నిర్లక్ష్యం ఉందా?
జోరందుకోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు - క్యాడర్ బలం ఎంత? నేతల నిర్లక్ష్యం ఉందా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Ananya Nagalla : అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
PM Modi on Yoga Day: దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
Embed widget