అన్వేషించండి

Modi Latest News:75 ఏళ్లు దాటితే బీజేపీలో రాజకీయంగా రిటైర్ కావాల్సిందేనా ? మోదీకి ఆ రూల్‌ వర్తిస్తుందా ?

Modi Latest News: 75 ఏళ్లు నిండినందుకు ఎల్. కే అద్వానీకి , మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను పక్కన పెట్టింది బీజేపీ. ఇప్పుడు మోదీకి ఆ రూల్ వర్తిస్తుందా లేదా?

Modi Latest News: సైద్ధాంతిక పార్టీగా బీజేపీకి పేరు. వ్యక్తుల మీద కాకుండా తమ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, పార్టీ నియమాలకు అనుగుణంగా నడుస్తుందని కమలం నేతలు చెబుతారు. గతంలో 75 ఏళ్లు నిండినందుకు ఆ పార్టీకి మూల విరాట్‌లలో ఒకరైన ఎల్. కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ఇవ్వలేదు. దాంతో వాళ్ల రాజకీయ జీవితం ముగిసిపోయంది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది.  

75 ఏళ్లు వస్తే రాజకీయాల నుంచి రిటైర్ కావల్సిందేనా..?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు విద్యార్హతలు, రిటైర్మెంట్ వంటివి ఉంటాయి. కానీ రాజకీయరంగంలో ఎలాంటి అర్హతలు, రిటైర్మెంట్ వంటివి లేవు. ఏవైనా తీవ్రమైన కేసుల్లో ఉంటే తప్ప రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతను రాజ్యాంగంలో పొందుపరచలేదు. అదే రీతిలో వ్యక్తి చనిపోతే తప్ప రాజకీయ పదవుల్లో నేతలకు రిటైర్మెంట్ అనేది లేదు. కానీ బీజేపీలో మాత్రం 75 ఏళ్లు దాటితే రాజకీయాల్లో నుంచి రిటైర్మెంట్ కావల్సిందేనని గతంలో పార్టీ నిర్ణయించింది. గుజరాత్ నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చాక దేశ రాజకీయాల్లోకి వచ్చే సరికి సీన్ మారిపోయింది. 75 ఏళ్ల వయసు వస్తే రిటైర్ కావాల్సిందే అన్న కారణంగా బీజేపీని దేశంలో ఓ రాజకీయ పార్టీగా నిలబెట్టిన రాజకీయధురంధరుడు అయిన ఎల్. కే అద్వాని, మురళి మనోహర్ జోషి వంటి నేతలను సైతం కమలం పార్టీ దూరం పెట్టింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా టికెట్ ఇవ్వలేదు. 

ప్రధాని మోదీకి ఈ నియమం వర్తించనుందా..?
ప్రధాని అభ్యర్థిగా మోదీ వచ్చినప్పుడే, అప్పటికే పార్టీలో సీనియర్, కీలక నేత అయిన అద్వానీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు మోదీ, అమిత్ షాలే కారణమని, గురువని చూడకుండా రాజకీయాల నుంచి బలవంతంగా రిటైర్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాని దీనిపై అటు మోదీ, అమిత్ షా కానీ, ఇటు అద్వానీ కానీ ఎక్కడా నోరు మెదపలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాత్రం బీజేపీ స్వరం మారింది. 75 ఏళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి అన్న నియమం ఏదీ లేదని, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేదని అమిత్ షా, హిమంత బిశ్వా శర్మ వంటి నేతలు మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2025 సెప్టెంబర్ 17వ తేదీ తో 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే 2024లో పోటీ చేసి ప్రధాని అయిన మోదీ పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. అయితే దీనికి చెక్ పెట్టడానికే అన్నట్లు అమిత్ షా వంటి ముఖ్య నేతలు ప్రధాని మోదీ ఈ ఐదేళ్ల టర్మ్ ప్రధానిగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి అమలు కాదన్న సంకేతాలను బీజేపీ ఇవ్వడం గమనార్హం.

బీజేపీ ఆలోచన ఏంటంటే..?
బీజేపీలో మోదీ స్థాయి జనాకర్షక నేతలు మరొకరు లేరు. కాంగ్రెస్‌ను ఖతం చేయడంలో మోదీ నైపుణ్యం పార్టీ నేతలందరికి తెలుసు. మోదీ- అమిత్ షా ద్వయాన్ని కాదని 75 ఏళ్ల నియమం కోసం నోరు మెదిపే ధైర్యం ఉన్న నేతలు పార్టీలో లేరు. ఆర్.ఎస్.ఎస్ వంటి మాతృసంస్థను కూడా శాసించే స్థాయిలో మోదీ- అమిత్ షా ద్వయం ఉన్నారన్న చర్చ పార్టీలోనే కాదు దేశవ్యాప్తంగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇలాంటి ఆలోచన చేసే ధైర్యం చేయని పరిస్థితి. 

75 ఏళ్లకు రిటైర్ కావాలన్న నియమం ఏదీ లేదంటూ, ఆ వయసు దాటిన బి.ఎస్ యుడియూరప్పను కర్ణాటక సీఎంగా కొనసాగించిన విషయాం ఉదహరిస్తున్నారు. హేమామాలినీ వంటి 75 ఏళ్లు దాటిన 2024లో ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం 75 ఏళ్ల దగ్గర ఉండి కీలక బాధ్యతలు నెరవేర్చుతు విషయం కూడా కమలం నేతలు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి వర్తించేది కాదని అర్థం అవుతుంది. అయితే ఆయా సందర్భాల్లో నేతలకున్న ప్రజాదరణ, పార్టీ అవసరాలు, రాజకీయ ప్రాధాన్యత అంశాలను బట్టి నియమాలు ఉంటాయని, అవసరం బట్టి పార్టీ మార్చుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Embed widget