అన్వేషించండి

Modi Latest News:75 ఏళ్లు దాటితే బీజేపీలో రాజకీయంగా రిటైర్ కావాల్సిందేనా ? మోదీకి ఆ రూల్‌ వర్తిస్తుందా ?

Modi Latest News: 75 ఏళ్లు నిండినందుకు ఎల్. కే అద్వానీకి , మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను పక్కన పెట్టింది బీజేపీ. ఇప్పుడు మోదీకి ఆ రూల్ వర్తిస్తుందా లేదా?

Modi Latest News: సైద్ధాంతిక పార్టీగా బీజేపీకి పేరు. వ్యక్తుల మీద కాకుండా తమ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, పార్టీ నియమాలకు అనుగుణంగా నడుస్తుందని కమలం నేతలు చెబుతారు. గతంలో 75 ఏళ్లు నిండినందుకు ఆ పార్టీకి మూల విరాట్‌లలో ఒకరైన ఎల్. కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ఇవ్వలేదు. దాంతో వాళ్ల రాజకీయ జీవితం ముగిసిపోయంది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది.  

75 ఏళ్లు వస్తే రాజకీయాల నుంచి రిటైర్ కావల్సిందేనా..?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు విద్యార్హతలు, రిటైర్మెంట్ వంటివి ఉంటాయి. కానీ రాజకీయరంగంలో ఎలాంటి అర్హతలు, రిటైర్మెంట్ వంటివి లేవు. ఏవైనా తీవ్రమైన కేసుల్లో ఉంటే తప్ప రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతను రాజ్యాంగంలో పొందుపరచలేదు. అదే రీతిలో వ్యక్తి చనిపోతే తప్ప రాజకీయ పదవుల్లో నేతలకు రిటైర్మెంట్ అనేది లేదు. కానీ బీజేపీలో మాత్రం 75 ఏళ్లు దాటితే రాజకీయాల్లో నుంచి రిటైర్మెంట్ కావల్సిందేనని గతంలో పార్టీ నిర్ణయించింది. గుజరాత్ నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చాక దేశ రాజకీయాల్లోకి వచ్చే సరికి సీన్ మారిపోయింది. 75 ఏళ్ల వయసు వస్తే రిటైర్ కావాల్సిందే అన్న కారణంగా బీజేపీని దేశంలో ఓ రాజకీయ పార్టీగా నిలబెట్టిన రాజకీయధురంధరుడు అయిన ఎల్. కే అద్వాని, మురళి మనోహర్ జోషి వంటి నేతలను సైతం కమలం పార్టీ దూరం పెట్టింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా టికెట్ ఇవ్వలేదు. 

ప్రధాని మోదీకి ఈ నియమం వర్తించనుందా..?
ప్రధాని అభ్యర్థిగా మోదీ వచ్చినప్పుడే, అప్పటికే పార్టీలో సీనియర్, కీలక నేత అయిన అద్వానీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు మోదీ, అమిత్ షాలే కారణమని, గురువని చూడకుండా రాజకీయాల నుంచి బలవంతంగా రిటైర్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాని దీనిపై అటు మోదీ, అమిత్ షా కానీ, ఇటు అద్వానీ కానీ ఎక్కడా నోరు మెదపలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాత్రం బీజేపీ స్వరం మారింది. 75 ఏళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి అన్న నియమం ఏదీ లేదని, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేదని అమిత్ షా, హిమంత బిశ్వా శర్మ వంటి నేతలు మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2025 సెప్టెంబర్ 17వ తేదీ తో 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే 2024లో పోటీ చేసి ప్రధాని అయిన మోదీ పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. అయితే దీనికి చెక్ పెట్టడానికే అన్నట్లు అమిత్ షా వంటి ముఖ్య నేతలు ప్రధాని మోదీ ఈ ఐదేళ్ల టర్మ్ ప్రధానిగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి అమలు కాదన్న సంకేతాలను బీజేపీ ఇవ్వడం గమనార్హం.

బీజేపీ ఆలోచన ఏంటంటే..?
బీజేపీలో మోదీ స్థాయి జనాకర్షక నేతలు మరొకరు లేరు. కాంగ్రెస్‌ను ఖతం చేయడంలో మోదీ నైపుణ్యం పార్టీ నేతలందరికి తెలుసు. మోదీ- అమిత్ షా ద్వయాన్ని కాదని 75 ఏళ్ల నియమం కోసం నోరు మెదిపే ధైర్యం ఉన్న నేతలు పార్టీలో లేరు. ఆర్.ఎస్.ఎస్ వంటి మాతృసంస్థను కూడా శాసించే స్థాయిలో మోదీ- అమిత్ షా ద్వయం ఉన్నారన్న చర్చ పార్టీలోనే కాదు దేశవ్యాప్తంగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇలాంటి ఆలోచన చేసే ధైర్యం చేయని పరిస్థితి. 

75 ఏళ్లకు రిటైర్ కావాలన్న నియమం ఏదీ లేదంటూ, ఆ వయసు దాటిన బి.ఎస్ యుడియూరప్పను కర్ణాటక సీఎంగా కొనసాగించిన విషయాం ఉదహరిస్తున్నారు. హేమామాలినీ వంటి 75 ఏళ్లు దాటిన 2024లో ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం 75 ఏళ్ల దగ్గర ఉండి కీలక బాధ్యతలు నెరవేర్చుతు విషయం కూడా కమలం నేతలు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి వర్తించేది కాదని అర్థం అవుతుంది. అయితే ఆయా సందర్భాల్లో నేతలకున్న ప్రజాదరణ, పార్టీ అవసరాలు, రాజకీయ ప్రాధాన్యత అంశాలను బట్టి నియమాలు ఉంటాయని, అవసరం బట్టి పార్టీ మార్చుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget