అన్వేషించండి

Karnataka Effect : కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందా ? బీజేపీ, కాంగ్రెస్ ఆశలేంటి ?

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందా ?కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకుంటారా ?బీజేపీ గెలిస్తే ఇక్కడా కమలం వికసిస్తుందా ?బీఆర్ఎస్ - జేడీఎస్ ప్రభావం ఎంత ?

 

Karnataka Effect :    కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎవరు గెలుస్తారన్నదానిపై ప్రజలు, సర్వే సంస్థలు ఓ అంచనాకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని ఏబీపీ - సీ ఓటర్ ఓపీనియర్ పోల్‌లో స్పష్టమైన అభిప్రాయ వినిపిస్తోంది. అయితే బీజేపీ అవకాశాల్ని తోసి పుచ్చలేం. మళ్లీ హంగ్ వచ్చే పరిస్థితుల్నీ కాదనలేం. అయితే ఖచ్చితంగా అక్కడి ఫలితాలు తెలంగాణ రాజకీయంపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి తెలంగాణలో ఊపు వస్తుంది. అధికారం కోసం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలో గెలిచే పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. 

కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంత ఉంటుంది ? 

రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం.  తెలంగాణలో కాంగ్రెస్‌ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్న భావన వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటకలో గెలవడానికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని అక్కడి నేతలకు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో ముందు నుంచీ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.

కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుంటే  బీజేపీకి అడ్వాంటేజ్ !

దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో మాత్రం రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎదురీదుతోంది. కర్ణాటకలో బీజేపీ స్వతహాగా విజయం సాధించలేదు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. అదే బీజేపీకి మైనస్ అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బీజేపీని తేలికగా తీసుకోలేరు చివరి వరకూ పోరాడుతుంది. అందుకే ఆ పార్టీ గెలిస్తే ఇక్కడ కూడా సంచనాలు నమోదవుతాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ విస్తరించాలనుకున్న రాష్ట్రం తెలంగాణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. పాత హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత కర్ణాటకలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ లక్ష్మణ్ తదితరులున్నారు. బీదర్‌లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావటంతో కర్ణాటకలో ప్రచారానికి మరికొంత తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు మోదీ అమిత్ షా జేపీ నడ్డాలు ప్రత్యేక దృష్టి సారించారు.

బీఆర్ఎస్ ప్రభావం ఎంత ?

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను కీలకంగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా తెలుగు ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అక్కడ రాజకీయాలు చేయబోతోందని అనుకున్నారు. కేసీఆర్ కూడా అదే ప్రకటించారు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. చివరి క్షణంలో జేడీఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉందేమో కానీ పోటీ చేసే చాన్స్ లేదు. ఒక వేళ బీఆర్ఎస్ సపోర్ట్  చేసి జేడీఎస్ కింగ్ మేకర్ అయితే..  భారత రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ లభించవచ్చు.  అయితే కర్ణాటక రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు. అక్కడి రాజకీయాలు తెలంగాణపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  కానీ ఓ రకమైన మోరల్ సపోర్టు గెలిచిన పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ లాంటి పార్టీకయితే నిధుల సమస్య కూడా తీరవచ్చు. అందుకే కర్ణాటక ఎన్నికలపై తెలంగాణ రాజకీయ పార్టీలు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయని అనుకోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget