అన్వేషించండి

MLC Result Analasys : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం ? టీడీపీ పుంజుకున్నట్లేనా ?

ఏపీలో పట్టభద్రులు ఇచ్చిన సంకేతం ఏంటి ?అధికార పార్టీకి షాకిచ్చారా ?ఓవరాల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హవా వైసీపీదేనా ?ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది ?

 

MLC Result Analasys : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ, పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎన్నికలు వరుసగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. సునాయాసంగా విజయం సాధించారు. ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే గెలుపొందారు. కానీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ? ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా ? టీడీపీ పుంజుకుందా ?

స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ హవా !

స్థానిక సంస్థల పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ హవా చూపించింది. అన్ని స్థానాలను గెల్చుకుంది. అయితే ఈ గెలుపు పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినది కాదు.ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలు.. జడ్పిటీసీలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాబట్టి వారు తప్ప మరెవరూ గెలవరు. కానీ ఉపాధ్యాయ  పట్టభద్రుల విషయంలో మాత్రం వైసీపీ మ్యాజిక్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరే్కతతో ఉన్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని  నిలబెట్టి మరీ గెలిపించుకుంది. ప్రైవేటు ఉపాధ్యాయుల ఓట్లను వైసీపీ బాగా పొందిందని.. ప్రభుత్వ ఉపాధ్యాయుల మద్దతు పొందలేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా గెలుపు గెలుపే. ఓట్లు తక్కువ అయినా వైసీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకుంది. 

పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలతో వైసీపీకి షాక్ ! 

అయితే ప్రజాభిప్రాయం వెల్లడవుతుందని భావిస్తున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీకి షాక్ తగలడం మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీని భారీ తేడాతో ఓడిపోవడం  ఆ పార్టీకి ఇబ్బందికరం. ఇక కంచుకోటల్లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ పట్టభద్రులు టీడీపీవైపే మొగ్గారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే  కాదు తూర్పు రాయలసీమ, ప శ్చిమలోనూ  వైఎస్ఆర్‌సీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది.  ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. పనులు ఆశించినట్లుగా లేకపోవడంతో  గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా పేరున్న  జిల్లాల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి ఎదురు గాలి వీచిందని నమ్ముతున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం. ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ పట్టు గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు జిల్లాలకు కలిపి టీడీపీకి ఉన్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా అనంతపురం జిల్లా నుంచే ఉన్నారు. అంటే ఏకపక్షంగా పట్టభద్రులు ఓటింగ్ చేయాల్సిన నియోజకవర్గం. కానీ ఫలితాలు అలా రాలేదు. 
 
సమీక్ష చేసుకుని దిద్దుకుంటేనే  

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తాము ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నామన్న ఓ రకమైన అభిప్రాయంలో ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తాజా ఎమ్మెల్సీ పరిణామాలతో అర్థమైపోతుంది. ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు కాబట్టి.. అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని అనుకోవచ్చు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటుందా అన్నది ఆసక్తికర అంశం.  ప్రత్యర్థులపై రాజకీయ దాడులు ఆపి ప్రజలకు అత్యధిక సమయం కేటాయించాలన్న విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే..  అది వారికి బలం ఇస్తుంది. కానీ టార్గెట్ చేసిన వారికి మైనస్ అవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేని సమయంలో..  ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సమీక్షించుకుని.. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం అధికార పార్టీపై పడిందని అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget