అన్వేషించండి

One Nation One Election : జమిలీ ఎన్నికలకు అసలైన సవాళ్లు ఎన్నో ! పరిష్కారాలను కోవింద్ కమిటీ సూచించగలదా ?

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ కు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటికి కోవింద్ నేతృత్వంలోని కమిటీ పరిష్కారాలు చూపిస్తుందా ?

 

One Nation One Election :  దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలకు కూడా ఒకే సారి ఎన్నికలు జరిపేలా సూచనలు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  18వ తేదీ నుంచి జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇది అంత సులువు కాదని సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చలు స్పష్టం చేస్తున్నాయి. 

సుదీర్ఘ కాలంగా జమిలీ ఎన్నికలపై చర్చలు
  
పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేది కొత్త వాదన కాదు. గతంలో నీతి ఆయోగ్ సూచించింది. లా కమిషన్ ప్రతిపాదించింది. ప్రధానమంత్రి మోడీ కూడా అనేక సార్లు చెప్పారు. పదే పదే ఎన్నికలు వస్తూండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నది మోడీ వాదన. అయితే జమిలీ ఎన్నికలు వల్ల ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం మారిపోతుంది. దేశాన్ని అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి.  లోతుల్లోకి వెళ్తేనే జమిలీ ఎన్నికల వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఏమిటి అనేది తెలుస్తుంది. దేశంలో  ప్రతి ఏడాది ఏదో ఒక ఎన్నిక వస్తూనే ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ, మధ్యంతర, ఉపఎన్నికలు ఇలా… ఏదో రూపంలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంపైనే దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ అభివృద్ధికి అడ్డుకట్ట పడుతోంది. పైకా ఖర్చు ఎక్కువ అవుతోంది. 

కానీ జమిలీ ఎన్నికలకు అనేక చిక్కులు !
 
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఉంటాయి. అంటే కేంద్ర, రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.  దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. పార్లమెంట్ తో కలిపి 30 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే… ఐదేళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుడా ఉండలేరు. అలా అన్ని మళ్లీ అన్ని రాష్ట్రాలకూ నిర్వహించలేరు. ఇలా కాకపోయినా..పార్లమెంట్ లో ఓ పార్టీకి మెజార్టీ వచ్చి… నాలుగో, ఐదో రాష్ట్రాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే.. .. ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతే.. వాటి పరిస్థితి ఏమిటి..? వాటి కోసం మళ్లీ మొత్తం ఎన్నికలు నిర్వహిస్తారా..? ఇలాంటి సమస్యలు చాలా వరకూ చర్చల్లోకి వచ్చాయి.  నీతిఆయోగ్ ముందు లా కమిషన్ ఓ ప్రతిపాదన పెట్టింది. అదేమిటంటే.. రెండున్నరేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుతామనేదే ఆ ప్రతిపాదన.  అప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధిస్తారు.  ఈ విషయాన్ని పార్లమెంట్ ఎన్నికలకూ అన్వయించినా సాధ్యం కాదని సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.  దీనికి కూడా నిపుణులు ఓ పరిష్కారం చూపిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలన్నా… విశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని నిరూపిస్తేనే.. ఆ అవిశ్వాస, విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలనేది..ఆ పరిష్కారం. అంటే… మెజార్టీ లేకపోయినా.. ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి.. ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని  నిపుణుల విశ్లేషణ.  
 
పాక్షికంగా అధ్యక్ష తరహా ఎన్నికకు ప్రతిపాదిస్తారా ? 
 
ఎన్నికలు జరిగిన తర్వాత  పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేనప్పుడు.. గవర్నర్ ఎమ్మెల్యేలను పిలిచి.. మీ నాయకుడ్ని ఎన్నుకోమని అడగాలి.  అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చు. జమిలీ ఎన్నికలనేదే సిద్ధాంతం.. ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయం వినపించడానికిప్రధాన కారణం  రాజ్యాంగరీత్యా నిబంధనలు అంగీకరించకపోవడం. ఇప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్లకు ముందే..రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు… ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం కొనసాగించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల జమిలీ ఎన్నికల వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి.  మొత్తంగా కాకపోయినా పాక్షిక జమిలీకి వెళ్లానుకుంటే   ఐదు నెలల ముందు.. ఐదు నెలల తర్వాత ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది.  ఇందుకు ఏపీ, ఒడిషా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.  అదే విధంగా ఐదు నెలల ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 13 రాష్ట్రాలను కలుపుకుని వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు తొలి అడుగు పడొచ్చు. 

అనేక సందేహాలకు కోవింద్ కమిటీ సమధానం ఇస్తుందా ? 

జమిలీ ఎన్నికలకు ఉన్న అడ్డంకులు రాజ్యాంగ సవరణల ద్వారా తీర్చేవి కావని.. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలని నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుత ఎన్నికల విధానం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంది. వీటికి పార్లమెంట్ లో ప్రదాని మోదీ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారో చూడాల్సి ఉంది. ఆ పరిష్కారాలను కోవింద్ కమిటీనే సిఫార్సు చేయాల్సి ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
Embed widget