అన్వేషించండి

పలాస వైసీపీలో తారాస్థాయికి విభేదాలు- టీడీపీ వైపు మంత్రి సీదిరి ప్రత్యర్థులు చూపు

పలాస వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నాయకులనే వేధిస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇప్పటికే పలాస లీడర్లు కోపంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి వారంతా భేటీ అయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలోని పలాస రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ వాతావరణం అక్కడ ఉంది. అధికారం అండతో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడుగా వ్యహరిస్తుండగా ప్రజాసమస్యలే అజెండాగా టీడీపీ ఇన్‌ఛార్జి గౌతు శిరీష అదే స్థాయిలో దూసుకువెళ్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పలాస పేరు వినిపిస్తూనే ఉంటుంది. 

అయితే ఇప్పుుడు వైసీపీలోనే ఏర్పడ్డ విభేదాలతో మరోసారి పలాస టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచే గ్రూపుల గోల ఉండనే ఉంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న వారంతా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఉనికి చాటుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్లంతా మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తున్నారు. మంత్రి వైఖరితో నాలుగేళ్లు విసిగిపోయామంటున్నారు. 
వైసీపీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న నాలుగు మండలాల్లోని కీలక నాయకులంతా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పార్టీలో ఉంటూనే మంత్రికి ప్రత్యర్థులుగా పని చేస్తున్నారు. పార్టీ కోసం మొదట నుంచి పని చేసిన వారికి విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కక్ష కట్టి అణిచివేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అండ్ టీంపై ఆరోపణలు చేస్తున్నారు. 

పలాస పరిధిలో మండలాలు, మున్సిపాల్టీలో కూడా అసమ్మతి నేతలంతా మంత్రి సీదిరి అండ్ టీంపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. మంత్రి అప్పలరాజు అనుచరులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రెండు గ్రూపుల మధ్య విభేదాలు పీక్స్‌కు చేరాయి. 

మంత్రి చేతిలో అధికారులు ఉన్నారన్న కారణంతో అసమ్మతి నేతలంతా కొన్ని రోజులుగా సైలెంట్‌ అయ్యారు. అధిష్ఠానం కూడా అప్పలరాజుకే అనుకూలంగా ఉండడంతో ఏం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వారి చూపు తెలుగుదేశం పార్టీ వైపు పడినట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నాయకులు వైసీపీలో అసమ్మతి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఆ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలతో రాయబారాలు సాగిస్తున్నారట.

వైసీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్, అసమ్మతి నేత దువ్వాడ శ్రీకాంత్‌ను టీడీపీ నేతలు కలుసుకున్నారు. వారి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. టీడీపీలోకి ఆహ్వానించినట్టుగా సమాచారం. మంత్రి సీదిరి అప్పలరాజుని వ్యతిరేకించి వైసీపీకి దూరంగా ఉంటున్నారో వారితో టీడీపీ టీం మాట్లాడుతోంది. అటువంటి వారు టీడీపీలో చేరితే సీదిరి అప్పలరాజుకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసమ్మతినేతలను కలుపుకునేందుకు సిదిరి నుంచి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget