అన్వేషించండి

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల కథ ముగిసినట్టేనా? టికెట్ దరఖాస్తుల్లో కనిపించని నేతలు

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఇప్పటికీ దేశంలో రాజకీయ విశ్లేషకులు ‘వృద్ధ కాంగ్రెస్’ అని పిలుస్తుంటారు. ఈ మచ్చను తుడిపేసుకునేందుకు హస్తం పార్టీ తెలంగాణలో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నదా..?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్  కొత్త ఎత్తుగడతో  అసెంబ్లీ ఎన్నికలతో బరిలోకి దిగుతోందా..? ‘వృద్ధ కాంగ్రెస్’ అన్న అపప్రదను తొలగించుకుని యువనాయకత్వానికి జై కొడుతుందా..?  వయసు మళ్లిన నాయకులను ఇంట్లోనే కూర్చోబెట్టి వారి వారసులతో ఎన్నికల సంగ్రామంలో  దూకుతుందా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  త్వరలో జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ‘సీనియర్ నాయకుల’ను కాదని వారి వారసులను కాంగ్రెస్ రంగంలోకి దింపుతున్నది.  ఇదే సమయంలో  గడిచిన నాలుగు దశాబ్దాలుగా పార్టీలో చక్రం తిప్పుతున్న సీనియర్  నాయకుల కథ కూడా ముగిసినట్టే కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కీలక నేతలుగా  ఉన్న రాజకీయ దురంధరులు జానారెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి, వి. హనుమంతరావు, జి.నిరంజన్ వంటి పలువురు నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకపొవడంతో వీరి రాజకీయ భవిష్యత్‌కు శుభం కార్డు పడ్డట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ  ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి ముగిసిన ఈ ప్రక్రియలో 119 నియోజకవర్గాల నుంచి సుమారు  వెయ్యికి పైగా అభ్యర్థులు టికెట్ కోసం ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించారు. కానీ జానారెడ్డి, హనుమంతరావు, గీతారెడ్డి, రేణుకా చౌదరి వంటి నాయకులు దరఖాస్తులు సమర్పించలేదు.

జానారెడ్డి వారసులకే జై.. 

ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చినాక 2014లో కూడా  ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి  కొంతకాలంగా  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2018లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన ఆయన 2020 ఉప ఎన్నికలలో  కూడా ఓటమిపాలయ్యారు.  అప్పట్నుంచి ఆయన  యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. 1978 నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా కూడా పనిచేశారు.  క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నా నాగార్జునసాగర్, మిర్యాలగూడ లలో ఆయనకు మంచిపట్టుంది. దీంతో ఆయన  వారసత్వాన్ని కుమారులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. 2020 ఉపఎన్నికలలో ఓటమి తర్వాత జైవీర్ రెడ్డి.. ఇక్కడే మకాం వేసి  ప్రజలతో మమేకమవుతున్నారు.  

బరిలో లేని గీతారెడ్డి..

ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకనేత అయిన గీతారెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. గతంలో జహీరాబాద్, గజ్వేల్ నుంచి గెలిచిన ఆమె.. వైఎస్ రాజశేఖరరెడ్డి,  రోశయ్య  ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.  2014లో జహీరాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  హైదరాబాద్ లోని కంటోన్మెంట్ నుంచి ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆమె అసలు పోటీలోనే లేరు.

హన్మంతన్న కూడా.. 

కాంగ్రెస్‌లో నాటి ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ ఆ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న వి. హనుమంతరావు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఆది నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని  విమర్శిస్తున్న ఆయన..  గతంలో అంబార్‌పేట్ నియోజకవర్గం నుంచి  పోటీ చేశారు. హైదరాబాద్ వాసులు హన్మంతన్న అని ముద్దుగా పిలుచుకునే ఆయన రాజకీయ జీవితానికి దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే.. 

ఫైర్ బ్రాండ్ జాడేది..? 

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుపొందిన  ‘ఫైర్ బ్రాండ్’ రేణుకా చౌదరి కూడా రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖంగానే ఉన్నారు. ఆమె కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు.  1984లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె..  ఇటీవల ఖమ్మం మన్యం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. కానీ ఆమె కూడా  అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. 

వీరితో పాటు  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీపీసీసీ ఎఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ కూడా  పోటీకి దూరంగా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా  తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుంటూ  ప్రత్యక్ష రాజకీయాల నుంచి క్రమంగా దూరమవుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Cabinet Ministers: బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
PM Modi AP Tour: ఏపీకి ప్రధాని మోదీ, సత్యసాయి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ఏపీకి ప్రధాని మోదీ, సత్యసాయి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Telangana Group 2 Cancel: 2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
Shriya Saran: వాట్సాప్ స్కామ్ బాధితులు...  మొన్న అదితి... ఇప్పుడు శ్రియ
వాట్సాప్ స్కామ్ బాధితులు... మొన్న అదితి... ఇప్పుడు శ్రియ
Advertisement

వీడియోలు

Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Cabinet Ministers: బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
PM Modi AP Tour: ఏపీకి ప్రధాని మోదీ, సత్యసాయి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ఏపీకి ప్రధాని మోదీ, సత్యసాయి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Telangana Group 2 Cancel: 2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
Shriya Saran: వాట్సాప్ స్కామ్ బాధితులు...  మొన్న అదితి... ఇప్పుడు శ్రియ
వాట్సాప్ స్కామ్ బాధితులు... మొన్న అదితి... ఇప్పుడు శ్రియ
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
GST 2.0 తర్వాత Royal Enfield Shotgun 650 ధర ఎంత పెరిగింది, ఈ బైక్‌లో ఏం మారింది?
Royal Enfield Shotgun 650: పేరుకే గన్‌, స్టార్ట్‌ చేస్తే బుల్లెట్‌ - కొనే ముందు ఇది తెలుసుకోండి
సినిమాలకు రిటర్మెంట్ ప్రకటించిన సీనియర్ నటి
సినిమాలకు రిటర్మెంట్ ప్రకటించిన సీనియర్ నటి
Bihar CM Oath Ceremony: నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Embed widget