అన్వేషించండి

Indravelli Meeting: నేడు ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం- దత్తతపై ‌ప్రకటన చేస్తారా!

CM Revanth Reddy First District Tour: 12 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ నాగోబా జాతలో పాల్గొంటారు. కేస్లాపూర్‌లో ప్రత్యేక పూజలు చేసిన రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లి వెళ్తారు.

Telangana CM Revanth Reddy Adilabad Tour: లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటించనున్న ఆయన ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు జనాలను తరలించారు. 

గతంలో దత్తతపై ప్రకటన 

2021 ఆగస్టు 9న ఆదివాసీ గిరిజన దళిత దండోరా పేరుతో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే సభను అధికార పార్టీగా జరుపుకుందామని అప్పుడే చెప్పారు. అంతే కాకుండా నిరాదరణకు గురైన ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

కేస్లాపూర్ నుంచి రోడ్డు మార్గంలో.. 

12 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న నాగోబా జాతలో పాల్గొంటారు. కేస్లాపూర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లి చేరుకుంటారు. పోలీసు కాల్పుల్లో అమరులైన ఆదివాసీ వీరులకు నివాళి అర్పిస్తారు. అక్కడే సుమారు కోటి రూపాయలతో ఏర్పాటు చేయబోయే స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

మూడు గ్యారంటీలపై క్లారిటీ 

ఇదే వేదికపై ఆదిలాబాద్ జిల్లా దత్తత అంశం, మూడు గ్యారంటీలపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆదిలాబాద్ సెగ్మెంట్‌లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు రాలేదు. ఇక్కడ బీజేపీ పట్టు సాధించింది. ఈ పార్లమెంట్‌ పరిధిలో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంటే... రెండు సీట్లను బీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంది. మిగిలిన ఒక సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు విజయం సాధించారు. అందుకే ఈ పార్లమెంట్ స్థానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించారు. విజయం లభించిందని ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget