అన్వేషించండి

Siddipeta News: ప్రధాని మోడీ, బండి సంజయ్ లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు- బీజేపీ నేత ఫైర్

Siddipeta News: ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

Siddipeta News: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, మాజీ హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము కూడా మంత్రి కేటీఆర్ ను పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడాడని, ఆయన తండ్రి కేసీఆర్ లాగా తాగొచ్చి మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడని అనవచ్చని... కానీ అది తమ సంస్కారం కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన సోదరి కవిత వ్యవహారంపై మాట్లాడకుండా, అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా ఏదో నోటికి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడాడన్నారు. ప్రధాని మోడీ, బండి సంజయ్ లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని, వారు కూడా కేటీఆర్ లాగే ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులని గుర్తు చేశారు. 

నిన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని తమ బీజేపీ కార్యకర్తలు అడ్డు కోవడానికి కారణమేంటో మంత్రి కేటీఆర్ అడిగితే స్థానిక ఎమ్మెల్యే తెలియదని చెప్పడం, ఆయన సోయిలేని తనానికి నిదర్శనమని అన్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్ ధోరణిని వ్యతిరేకిస్తూ.. ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న చిన్న చూపును ఎత్తి చూపడానికే బస్సు ముందుకు వెళ్లారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ వందల కోట్ల నిధులు తీసుకువచ్చారని, అసలు రాష్ట్రంలోనీ ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి హుస్నాబాద్ ప్రాంతంలో జరగలేదని, కావాలంటే అక్కడికి వెళ్లి చూసి రావడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మూడు బస్సులు పెట్టి ప్రతిపక్ష నాయకులను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాత్రికేయలను తీసుకెళ్లడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఏం చేశారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కానీ బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని.. ఆ లిస్టు తన దగ్గర ఉందని పేర్కొన్నారు. చివరకు నిన్నటి బహిరంగ సభకు కూడా ఉపాధి హామీ కూలీలను, మహిళలను బెదిరించి తీసుకువచ్చారని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ఇంకా పూర్తికాలేని ప్రాజెక్టును పూర్తయిందని ఎలా చెప్తున్నారనీ, పూర్తి అయితే తాము సంతోషిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు మాట్లాడిన రాబోయే కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget