అన్వేషించండి

AP Rajyasabha Seats : ఏపీలో రాజ్యసభ చాన్స్ ఆ నలుగురికే ! అలీ పేరేది ?

వైఎస్ఆర్‌సీపీలో రాజ్యసభ అభ్యర్థులు ఖరారయినట్లుగా తెలుస్తోంది. రెండు బీసీ, ఒకటి రెడ్డి, మరొకటి ఉత్తరాది వ్యాపారవేత్తకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అలీ పేరు వినిపించడం లేదు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో ఒకరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. మిగతా ముగ్గురు బీజేపీ ఎంపీలు.  అయితే ఈ నాలుగు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆశావహులు ఎవరు అన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది తమకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలలు స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలనుకుంటున్నారు. అయితే పారిశ్రామిక వేత్తల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

విజయసాయిరెడ్డికి కొనసాగింపు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిందన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయనకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కోఆర్డినేట్ చేసుకునే పదవి ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డికి మళ్లీ ప్రాధాన్యం పెరిగిందని ఆయన రాజ్యసభ స్థానానికీ ఢోకా లేదని చెబుతున్నారు. 

మిగతా మూడు సీట్లు ఎవరికి ?

విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో  రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా  నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి  వైఎస్ఆర్‌సీపీలో చేరిన  మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు.  వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన నేత. 

మరొకటి అదానీ  ఫ్యామిలీకి.. మరి అలీ సంగతేంటి ? 

ఇక మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నట్టు సమాచారం.అదానీ భార్య ప్రీతి .లేదా కుమారుడు జీత్ లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అదే జరిగితే దేశంలోని ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలకు ఏపీ నుండి రాజ్యసభ సీట్లు దక్కినట్టు అవుతుంది. గతంలో అంబానీ సిఫార్సు మేరకు వ్యాపారవేత్త పరిమల్ నత్వానీ కి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. కానీ ఇప్పుడు ఆయన పేరు రేసులో వెనుకబడింది. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget