అన్వేషించండి

Peoples Front KCR : మార్చి 3న వారణాశిలో పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావం ? మెగా ర్యాలీ ప్లాన్ చేస్తున్న మమతా బెనర్జీ !

పీపుల్స్ ఫ్రంట్ పేరుతో దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారణాశిలో మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో బీజేపీ నేతలు వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

ప్రగతి భవన్‌లో కేసీఆర్ ( KCR ) చెప్పిన పీపుల్స్ ఫ్రంట్ ( Peoples Front )  దిశగా అడుగులు పడుతున్నాయి.  తాను ఫోన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడానని దేశంలోని సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ( Mamata Benarjee ) ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రాంతీయ పార్టీలు సఖ్యతగా లేవని..  ఆ పార్టీ తన దారిలో తాను వెళ్తోందన్నారు. మా  దారిలో మేము వెళ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.  యూపీలో మమతా బెనర్జీ సమాజ్ వాదీ పార్టీకి ( SP ) మద్దతు తెలిపారు. ఆ పార్టీకి ఇబ్బందికరం కాకూడదని పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మోడీ నియోజకవర్గం వారణాశిలో ( Varanasi ) భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి మూడున ఈ మెగా ర్యాలీ జరుగుతుంది.  

వారణాశిలో  జరగనున్న మెగా ర్యాలీకి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలూ హాజరయ్యే అవకాశం ఉంది.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మోడీపై విరుచుకుపడుతున్నారు. యూపీలో- ( UP Elections )  సమాజ్ వాదీగా మద్దతు పలుకుతారన్న ప్రచారం కూడా జరిగింది. అది నేరుగా వెళ్లి ర్యాలీలో పాల్గొని మద్దతు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక స్టాలిన్ ( Tamil Nadu CM Stalin ) మమతా  బెనర్జీకి ఇప్పటికే మద్దతు ప్రకటించారు.  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - గవర్నర్ మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ బెంగాల్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టాలిన్ మండిపడ్డారు.  తమిళనాడులోనూ స్టాలిన్‌కు గవర్నర్‌తో చిక్కులు ఉన్నాయి. నీట్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపారు. ఇలాంటి పరిస్థితులతో గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

త్వరలో బీజేపీయేతర సీఎంలందరూ ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అలా సమావేశం అయితే ఓ ప్రాంతీయ పార్టీల కూటమికి దగ్గర దారి ఏర్పడినట్లే అనుకోవాలి.కే సీఆర్ కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది.  ఇటీవల కేసీఆర్ కూడా గవర్నర్‌తో సఖ్యతగా లేరు. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ రాజ్ భవన్‌కు హాజరు కాలేదు. గవర్నర్ బయటకు తెలియని రాజకీయం ఏదో చేస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గవర్నర్ల వ్యవస్థపై బీజేపీయేతర సీఎంలు తొలి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీయేతర సీఎంల సమావేశం మార్చి మూడున వారణాశి ర్యాలీ తర్వాత జరుగుతుందా.. ముందు  జరగుతుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఓ సారిప్రాంతీయ పార్టీల నేతలందరూ కలసి చర్చించుకుంటే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా వారణాశి ర్యాలీలో అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలూ కలిస్తే అదే జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అయ్యే అవకాశం ఉంది. ఆ ర్యాలీనే  పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావంగా చెప్పుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget