అన్వేషించండి

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల కోరిక ఒకటి నెరవేరింది- మరి రెండోది నెరవేరుతుందా?

సినీయర్లను, రేవంత్ వర్గీయులను ఒక్కటి చేయడం, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని రంగం సిద్ధం చేయడం. మరి ఠాక్రే తనకున్న అనుభవంతో ఈ సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ఒక తాటిపైకి తీసుకొస్తారో చూడాలి. 

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు విజయం సాధించారు. అనుకున్న విధంగా ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి ఏఐసిసి తప్పించి, గోవా ఇన్ ఛార్జ్ గా పంపించింది. మహారాష్ఱ్రాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాణిక్ రావు ఠాక్రేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కు ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఇన్నాళ్లు ఇన్ ఛార్జ్ ను మార్చాలని బహిరంగంగానే డిమాండ్ చేసిన సీనియర్ల డిమాండ్ ఒకటి నెరవేరింది. ఇక సీనియర్ల డిమాండ్లలో మరొకటి నెరవేరుతుందా ?  లేదా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

నిన్నటివరకు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు కమిటీల నియామకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఒక్కటయ్యారు. మూకుమ్మడిగా తిరుగుబాటు లేవదీశారు. దీంతో దిగివచ్చిన అధిష్టానం ఆఘమేఘాల మీద శాంతి దూతగా దిగ్విజయ్‌ సింగ్‌ ని పంపింది. ట్రబుల్‌ షూటర్ కి సమస్యలన్ని విన్నవించడంతో పాటు ప్రధాన డిమాండ్లను ముందుంచారు. అందులో మొదటిది ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ని తొలగించాలని పట్టుబట్టారట. ఇక రెండవది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ని తప్పించాలని కూడా స్పష్టం చేశారని వార్తలు వినిపించాయి. సీనియర్ల సమస్యలను విన్న దిగ్విజయ్‌ ఎంత స్పీడులో వచ్చారో అంతే వేగంతో ఢిల్లీకి చేరి అధిష్టానానికి విషయాన్ని వివరించారట.

తెలంగాణ కాంగ్రెస పార్టీ పై ఖర్గే నజర్. 

ఖర్గే అధ్యక్షత కాంగ్రెస్‌ పెద్దలంతా డిసైడ్‌ ఎట్టకేలకు మాణిక్కం ఠాగూర్‌ ని తప్పుకోమని సూచించడంతో ఆయన రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే ఈ వార్త సీనియర్లకు కాస్తంత సంతోషం కలిగించినా ఇక మరో డిమాండ్‌ పై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. జనవరి 26నుంచి కాంగ్రెస్ పార్టీ  హాత్‌ సే యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇది రేవంత్ రెడ్డి పాదయాత్ర అని ప్రొజెక్ట్ చేస్తున్నారు రేవంత్ వర్గీయులు. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అని అంటున్నారు.  ఇలాంటి తరుణంలో జరిగిన కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల కార్యక్రమానికి భట్టి , మధుయాష్మికీ మినహాయించి మిగిలిన సీనియర్లంతా హాజరుకాలేదు. ఖర్గే ఫోన్‌ చేసి మరీ సీనియర్లంతా హాజరుకావాలని చెప్పినా కానీ వారు హాజరు కాకపోవడంతో పీసీసీ అధ్యక్షుడిని మార్చితే కానీ వెనక్కి తగ్గేలా లేరన్న వార్త నిజమేనన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే రేవంత్‌ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటే నేను రాజీనామాకి సిద్ధమని ఆయన చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. 

ప్రియాంకాగాంధీ రాష్ట్రానికి వస్తారా? పార్టీని చక్కపెడతరా? 

ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా అన్నది కూడా అప్పుడే డిసైడ్‌ అవుతుందన్న వాదన కూడా ఉంది. అంతేకాదు ప్రియాంక గాంధీ తన నమ్మకస్తులను తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా కానీ సీనియర్లలో కొందరు రేవంత్‌ కి అనుకూలంగా ఉంటే మెజార్టీ మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకొంతమంది ఈ గొడవలు వద్దనుకొని పార్టీలు మారుతున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ కి పూర్వవైభవం రావాలంటే సీనియర్లంతా కలిసి ఉండటమే కాదు జూనియర్లని రంగంలోకి దింపి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రజల్లో కూడా నేతల్లో సఖ్యత ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. అప్పటి కానీ కాంగ్రెస్‌ ని తిరిగి నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

ఠాక్రే కు సమస్యలు స్వాగతం. 
మాణిక్ రావు ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. ఠాక్రే ముందు రెండు సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సినీయర్లను, రేవంత్ వర్గీయులనున ఒక్కటి చేయడం, రెండు ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని రంగం సిద్ధం చేయడం. మరి ఠాక్రే తనకున్న సుదీర్షరాజకీయ అనుభవంతో ఈ సమస్యలను పరిష్కరించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ఒక తాటిపైకి తీసుకొస్తారో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Women's Kabaddi World Cup | కబడ్డీ వరల్డ్ కప్‌ ఇండియాదే
Karun Nair Crypitc Post Ind vs SA | ట్విట్టర్ వేదికగా కరుణ్ నాయర్ విమర్శలు
India vs South Africa Test Match | కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget