అన్వేషించండి

RajyaSabha NDA : రాజ్యసభలో మెజార్టీ సాధించనున్న ఎన్డీఏ - ఇక వైఎస్ఆర్‌సీపీ అవసరం బీజేపీకి లేనట్లే !

YSRCP : రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి ఉపఎన్నికల తర్వాత మెజార్టీ రానుంది. గతంలో వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకమయ్యేది, ఈ సారి సొంంగానే ఎన్డీఏకు మెజార్టీ దక్కబోతోంది.

NDA alliance will get majority in  RajyaSabha : ఎన్డీఏ కూటమి రాజ్యసభలో పూర్తి మెజార్టీ సాధించనుంది.   కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం ఎగువసభలో మెజారిటీ ఉండటం కీలకం.   ఎగువసభలో ప్రస్తుతం ఉన్న 229 స్థానాలలో బిజెపికి 87 మాత్రమే ఉన్నాయి.  ఎన్‌డిఎలోని ఇతర పార్టీలతో కలిసి ఆ బలం 105కు చేరింది. ఆరుగురు నామినేటెడ్‌ సభ్యులు ఎలాగూ అధికార పక్షానికే ఓటు వేస్తారు కనుక ప్రభుత్వ పక్షాన 111 మంది సభ్యులు ఉన్నట్లు.  

ఉపఎన్నికలు జరగనున్న 12 స్థానాల్లో 11 గెల్చుకోనున్న బీజేపీ, మిత్రపక్షాలు           

సెప్టెంబరులో రాజ్యసభలోని 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో పదకొండు స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడనున్నాయి.  వక్ఫ్‌ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మెజారిటీ సాధించడం బిజెపికి తప్పనిసరి. కాంగ్రెస్‌కు 26 మంది సభ్యులు ఉండగా మిత్రపక్షాల బలం 58. అంటే ఇండియా కూటమి మొత్తం బలం 84.  వైసిపికి చెందిన 11 మంది, బిజెడికి చెందిన 8 మంది ఉన్నారు. తాము వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తామని ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. 

తప్పిన కేటీఆర్ అంచనాలు - కవితకు బెయిల్ లేనట్లే - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇవిగో

122కు చేరనున్న ఎన్డీఏ బలం -  బిల్లులు నెగ్గించుకోవడానికి కావాల్సిన మెజార్టీ 

తొమ్మిది రాష్ట్రాల నుండి 12 స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జమ్మూకాశ్మీర్‌ నుండి నలుగురు ఎగువసభకు ఎన్నిక కావాల్సి ఉంది. అక్కడ శాసనసభ లేకపోవడంతో ఎన్నికలు జరగవు. దీంతో రాజ్యసభ సభ్యుల సంఖ్య 241కి తగ్గుతుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ఇందులో జమ్మూకశ్మీర్ కి సంబంధించి అసెంబ్లీలు లేకపోవడంతో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి  . ప్రస్తుతం పన్నెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పన్నెండు కాకుండా 229 మందిలో ఎన్డీఏ పార్టీలకు 105 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకే మద్దతిస్తారు. అంటే 111  మంది. ఉపఎన్నికలు జరుగుతున్న 12 రాజ్యసభ స్థానాల్లో 11 బీజేపీ , మిత్రపక్షాల ఖాతాల్లో ఏకగ్రీవంగా పడనున్నాయి అంటే 122 మంది సభ్యుల బలం ఉన్నట్లే. 

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక - ఇక హద్దుమీరితే కఠిన చర్యలే

వైసీపీ, బీజేడీలు బీజేపీకి మద్దతివ్వకపోయినా  నో ప్రాబ్లం                                              

ప్రస్తుతం 241 సీట్ల రాజ్యసభలో 122 మంది సభ్యులు అంటే.. సాధారణ  మెజార్టీ వచ్చినట్లే.  వైసీపీ, బీజేడీ మద్దతు బీజేపీకి అక్కర్లేదు. పదకొండు మంది రాజ్యసభ సభ సభ్యులు ఉన్న వైసీపీ.. తమ అవసరం బీజేపీకి ఉందని ఆ పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఉపఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమికి ఇక ఎవరి అవసరం ఉండకపోవచ్చు. అందుకే..  వక్ఫ్ బిల్లును అప్పటికే సభలోకి వచ్చేలా జేపీసీకి పంపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget