అన్వేషించండి

Mylavaram Politics : మైలవరంలో మారుతున్న రాజకీయం, దేవినేని ఉమా ఏ గట్టునుంటారో?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపణలూ ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన ఏ గట్టునుంటారో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దేవినేని ఉమామహేశ్వరరావు...టీడీపీలో ఫైర్ బ్రాండ్ పేరున్న నేత. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆయన ప్రస్థానం ఎలా ఉంటుంది. పార్టీ నేతల్లో ఉమాపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది. అందరూ అంటున్నట్లే ఈ సారి ఉమాకు సీట్ లేదా? పార్టీకి పని చేయటం వరకే ఆయన పరిమితమా అనే సందేహాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

దేవినేని ఉమా రూటెటు 

దేవినేని ఉమా భవిష్యత్ కార్యచరణ ఏంటి? పార్టీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది. అనే అంశాలు టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల వరకు దేవినేని ఉమా టీడీపీలో అత్యంత కీలకమైన నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పని చేయటంతో ఆయనకు ఎదురులేదన్నట్లుగా వాతావరణం కనిపించింది. కానీ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటారు, ఇప్పుడు ఆయనకు పార్టీలో సీటు లేదన్నట్లుగా వాతావరణం మారిపోయింది. సిట్టింగ్ నియోజకవర్గం అయిన మైలవరం నుంచి దేవినేని ఉమాను పోటీ చేయించేందుకు స్దానిక టీడీపీ నేతలే సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదని, క్యాడర్ ను అమ్మా...ఎంటమ్మా...అంటూ దూరం పెట్టేశారని, దీంతో ఇప్పుడు ఆయన తిరిగి అదే నియోజకవర్గంలో పోటీకి దిగుతుంటే, మా పరిస్దితి ఏంటి అన్నదానిపై క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొందని అంటున్నారు.

రాష్ట్రం లెక్కలు సరే 

దేవినేని ఉమా ఎమ్మెల్యేగా  ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు. మంత్రిగా రాష్ట్రం మెత్తం తిరిగి, ప్రాజెక్టులు వ్యవహరంలో లెక్కలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించారని, అయితే అదే సమయంలో పార్టీని నమ్ముకున్న క్యాడర్ ను గాలికి వదిలేశారని అంటున్నారు. అన్ని లెక్కలను అనర్గళంగా చెప్పే దేవినేని ఉమా నియోజకవర్గంలో కార్యకర్తలు, వారి పరిస్థితులపై కనీసం వాకబు కూడా చేయలేదని, దీంతో వారంతా ఇప్పుడు ఉమాను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

 వసంత రూపంలో...

మైలవరం నియోజకర్గంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితులు నేపథ్యంలో వైసీపీలో  ఇమడలేక పక్క చూపులు చూస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ పై టీడీపీ నేతల ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. టీడీపీ నుంచి దేవినేని ఉమాను ఓడించేందుకు వైసీపీ గత ఎన్నికల్లో వసంతను రంగంలోకి తీసుకువచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్దితుల్లో వసంతకు టీడీపీలో లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం  ఇప్పుడే ఊపందుకుంది. ఇదే సందర్బంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వసంత ఏ పార్టిలో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నారా లేక, స్వతంత్రంగా ఉన్నారా, అది కాకపోతే టీడీపీలో ఉన్నారా ?అని కేశినేని ప్రశ్నించారు. దీంతో టీడీపీలోకి వసంతను తీసుకురావటం కోసమే నాని ఈ కామెంట్స్ చేశారని చెబుతున్నారు.

ఇక సైడవ్వాల్సిందేనా?

తాజాగా టీడీపీలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఎక్కువ శాతం సీట్లు కొత్త వారికి, యువతకు ఇవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. అందులో భాగంగానే అత్యధిక నియోజకవర్గాలకు సీనియర్లను పక్కన పెట్టి, వీలైతే వారి వారసులు లేదంటే యువతకు సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారయినా సరే పార్టీ నిర్ణయం మేరకు వ్యవహరించాలని, పార్టీని గెలిపించటమే ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేవినేని ఉమా ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు త్యాగం చేయక తప్పదా అనే అనుమానాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget