అన్వేషించండి

Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల

Andhra News: మాజీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన జగన్ ఛీత్కారానికి గురయ్యారని ఎద్దేవా చేశారు.

Minister Nimmala Strong Counter To Ys Jagan Through Twitter: అబద్ధాల్లో మాజీ సీఎం జగన్‌కు (Jagan) ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని.. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) హితవు పలికారు. ఈ మేరకు పోలవరంపై జగన్ చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ ఛీత్కారానికి  గురయ్యారని సెటైర్లు వేశారు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి  దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప అంటూ మండిపడ్డారు. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు అర్థమైపోయిందని.. అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్‌కు తెర లేపారని అన్నారు. 'పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించా. అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారు.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అలా కోరింది జగన్ కాదా.?'

పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారకులయ్యారని మంత్రి నిమ్మల జగన్‌పై ధ్వజమెత్తారు. 'ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్‌ను కూలగొట్టి 38 మంది ప్రాణాలు బలిగొన్నారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా.?. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా.?. 41.15 మీటర్లకు తగ్గించాలని కేంద్రం అనుమతి కోరింది జగన్ కాదా.?. ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు పెంచి నదుల అనుసంధానం ద్వారా ఏపీని సస్యశ్యామలం చేస్తుంది.' అని స్పష్టం చేశారు.

కాగా, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా.. ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ సీఎం జగన్.. సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీని వల్ల ప్రాజెక్ట్ లక్ష్యాలు దెబ్బతింటాయని.. దేనికి లాలూచీ పడి ఈ పనికి ఒడిగట్టారంటూ ఆయన పేర్కొన్నారు. 'మీ స్వార్థ రాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేట ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు కదా?.' అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల ట్విట్టర్‌లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget