అన్వేషించండి

Ambati Rambabu: 'పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే' - జనసేనానిపై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కు అసలు పార్టీ నడపడమే రాదంటూ ఎద్దేవా చేశారు.

Minister Ambati Rambabu Slams Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన సభలో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు అసలు జనాలు రాకపోవడంతోనే ఆలస్యంగా మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. 'తాడేపల్లిగూడెం సభలో పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో అని అభిమానులు ఎదురు చూశారు. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించేందుకే జెండా సభ పెట్టినట్లుంది. పవన్ కల్యాణ్ సభలో కనీసం అవగాహన లేకుండా సినిమా డైలాగ్స్ కొట్టారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్.. ఇప్పుడు తనను ప్రశ్నించవద్దంటూ ఎవరిని బెదిరిస్తున్నారు.?. ఆయనకు అసలు పార్టీ నడపడమే రాదు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే.' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

'నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే'

'పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరే. సీఎం జగన్ ను తొక్కేస్తానంటూ ఆవేశంగా మాట్లాడారు. లేకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నారు. అవును.. ఆయన పేరు పవన్ కల్యాణే కాదు. జగన్ ను పాతాళానికి తొక్కాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలి. ఇచ్చిన మాటపై నిలబడి నాయకుడు వైఎస్ జగన్. అలాంటి జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కు లేదు. నీ జనసైనికులను అడుగు. పవన్ గొప్పో, జగన్ గొప్పో చెబుతారు. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండు లాంటి వారు.' అంటూ అంబటి ఘాటుగా వ్యాఖ్యానించారు.

'అప్పుడు బాధ అనిపించలేదా.?'

చంద్రబాబుని జైల్లో పెడితే బాధేసిందని పవన్ విలపించారని.. మరి వంగవీటి రాధను హత్య చేసినప్పుడు నీకు బాధ కలగలేదా.? అని అంబటి ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా.? అని నిలదీశారు. కాపు సోదరులంతా పవన్ గురించి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. 'చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి. పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేశ్ ను సభకు రానివ్వలేదు. చంద్రబాబు అన్నీ తెలిసిన వాడు కావడం వల్లే లోకేశ్ ను సభకు వద్దన్నారు. లోకేశ్ టీడీపీకి శకునం. ఆయన వచ్చిన తర్వాతే టీడీపీ ప్లాప్ అయిపోయింది.' అంటూ అంబటి సెటైర్లు వేశారు.

అటు, మంత్రులు పేర్ని నాని, రోజా, వేణుగోపాలకృష్ణ సైతం పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ వామనుడు కాదని, శల్యుడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ - జనసేన సభలో కేవలం సీఎం జగన్ నామస్మరణే చేశారని.. వారికి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. సినిమా డైలాగులు బట్టీ పట్టారని.. సభలో గట్టిగా అరిచినంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు పడవంటూ మంత్రి రోజా విమర్శించారు. పవన్ చంద్రబాబుకు ఊడిగం చేస్తూ పాతాళంలోకి కూరుకుపోయారని.. సీఎం జగన్ ను విమర్శించే నైతిక హక్కు పవన్ కు లేదని అన్నారు.

Also Read: Andhra Pradesh Congress : ఏపీ కాంగ్రెస్ టిక్కెట్లకు పుల్ డిమాండ్ - కిటకిటలాడుతున్న బెజవాడ ఆంధ్రరత్న భవన్ !

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget